పులివెందుల కోర్టులో సీబీఐ వేసిన పిటిషన్‌లో ఏముంది..?

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు విషయంలో సీబీఐ గుంభనంగా వ్యవహరిస్తోంది. గతంలో ఓ సారి విచారణ జరిపి.. ఆ వివరాలతో ఢిల్లీ వెళ్లిన సీబీఐ అధికారులు మూడు రోజుల కిందట.. రెండో దఫా విచారణ ప్రారంభించారు. ఈ సారి విచారణ ప్రారంభించిన తర్వాత అనూహ్యమైన ట్విస్ట్ ఇచ్చారు. పులివెందుల కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ వివరాలేమిటన్నది బయటకు రాలేదు. రెండు, మూడు రోజుల్లో ఆ పిటిషన్‌ను తెరిచి కోర్టు విచారించే అవకాశం ఉంది. ఇప్పుడు సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ ఏమిటన్నదానిపైనే రకరకాల చర్చలు… జరుగుతున్నాయి.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో.. చాలా మంది ప్రముఖుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ముఖ్యంగా వైఎస్ కుటుంబసభ్యుల పేర్లే అనుమానితుల జాబితాలో మొదటి వరుసలో ఉన్నాయి. వైఎస్ వివేకా కుమార్తె కూడా… అదే చెబుతున్నారు. ఆమె ఈ కేసు విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నారు. పట్టుబట్టి సీబీఐ విచారణ సాధించడమే కాదు.. సీబీఐ అధికారులకు దగ్గరుండి అన్ని వివరాలు అందిస్తున్నారు. దీంతో కేసు కీలక మలుపులు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో… సాక్ష్యాలు తుడిచేయడానికి ప్రయత్నించిన వారు… కేసును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించిన వారే.. నేరానికి పాల్పడి ఉంటారనేది.. క్రైమ్ విచారణలో పోలీసులు ఫాలో అయ్యే మొదటి ఫార్ములా. ఈ ప్రకారం చూసినా పలువురు ప్రముఖులు ఇరుక్కోవడం ఖాయంగా కనిపిస్తోంది.

ప్రస్తుతం.. ఉన్న పరిస్థితుల కారణంగా.. వైఎస్ కుటుంబసభ్యుల్ని కానీ.. వివేకా హత్య కేసులో అనుమానితులైన వారిని కానీ పిలిపించి విచారించే అవకాశం ఉండదు. పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిందని హైకోర్టు తరచూ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో… కడపకో.. పులివెందులకో.. మిగతా వారిని పిలిపించి ప్రశ్నించే అవకాశం ఉండదని.. అందు కోసం.. పిటిషన్ దాఖలు చేశారని కొంత మంది చెబుతున్నారు. మరికొంత మంది మాత్రం.. అరెస్టుల కోసమే పిటిషన్లు దాఖలు చేసినట్లుగా అనుమానిస్తున్నారు. మొత్తానికీ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ మాత్రం… ప్రస్తుతం చర్చనీయాశం అవుతోంది. ఆ పిటిషన్‌లో వివరాలు తెలియకపోవడంతో.. రాజకీయవర్గాల్లోనూ మరింత ఆసక్తి రేపుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

22మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ లోకి హరీష్..!?

బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హారీష్ రావు కాంగ్రెస్ లో చేరనున్నారా..? 20-22 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరనున్నారని ప్రచారం జరుగుతుండగా..ఆ ఎమ్మెల్యేల వెనక బీఆర్ఎస్ ముఖ్య నేత హరీష్ రావు...

కేసీఆర్, కేటీఆర్ లేకపోతే తెలంగాణ ఏమైపోతుందో !?

బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణను ఎవరో ఎత్తుకుపోతారన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తాము ఉన్నప్పుడంతా స్వర్గం.. ఇప్పుడు నరకం అని ప్రజలకు చెబుతున్నారు. విచిత్రం ఏమిటంటే.. కొత్తగా తాము లేకపోతే...

వాలంటీర్ల లేకపోతే ఇంటింటికి పెన్షన్లు ఇవ్వలేరా ?

ఒకటో తేదీన పించను ఇంటి వద్ద ఇవ్వడానికి ఉద్యోగులు సరిపోరని నమ్మించడానికి ఏపీ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వారు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. పించన్లను బ్యాంక్ అకౌంట్లలో...

కండోమ్స్ ఎక్కువగా వాడేది వారేనా..మోడీకి కౌంటర్

లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రసంగం ఆశ్చర్యపరుస్తోంది. గతానికి భిన్నంగా మాట్లాడుతుండటమే ఇందుకు కారణం.గాంధీ కుటుంబంపై మాత్రమే విమర్శలు చేసే మోడీ గత కొద్ది రోజులుగా రూట్ మార్చారు. కాంగ్రెస్ అకారంలోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close