మ‌హా స‌ముద్రం.. సిద్దార్థ్ ఎంట్రీ!

శ‌ర్వానంద్ – అజ‌య్ భూప‌తి కాంబినేష‌న్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం `మ‌హా స‌ముద్రం`. ఈ సినిమాలో సిద్దార్థ్ కూడా న‌టిస్తున్నాడ‌ని వార్త‌లొచ్చాయి. ఇప్పుడు చిత్ర‌బృందం అధికారికంగా ధృవీక‌రించింది. ఈ రోజు ఉద‌యం 9 గంట‌ల 9 నిమిషాల‌కు ఈ సినిమాకి సంబంధించిన ఓ అప్ డేట్ ఉంటుంద‌ని ముందే ప్ర‌క‌టించిన చిత్ర‌బృందం.. సిద్దార్థ్ పేరుని అఫీషియ‌ల్ గా ఖ‌రారు చేసింది. ”’తెలుగులో రీ ఎంట్రీ కోసం సిద్దార్థ్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. చాలా క‌థ‌లు విన్న త‌ర‌వాత‌.. మ‌హా స‌ముద్రం క‌థ‌ని ఓకే చేశారు. శ‌ర్వా, సిద్దార్థ్ లాంటి ఇద్ద‌రు ప్ర‌తిభావంత‌మైన క‌థానాయ‌కులు తెర‌ని పంచుకోవ‌డం త‌ప్ప‌కుండా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఓ స‌రికొత్త అనుభూతి ఇస్తుంది” అని చిత్ర‌బృందం తెలిపింది. ఈసినిమాకి సంబంధించి ప్ర‌తీ వారం ఓ అప్ డేట్ ఇస్తామ‌ని నిర్మాణ సంస్థ చెబుతోంది. క‌థానాయిక‌గా సాయి ప‌ల్ల‌వి పేరు ప‌రిశీల‌న‌లో ఉంది. త్వ‌ర‌లోనే త‌న పేరు కూడా ధృవీక‌రించే అవ‌కాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిరుని క‌లిసిన మారుతి.. ఏం జ‌రుగుతోంది?

చిరంజీవితో ఓ సినిమా చేయాల‌ని మారుతి ఎప్ప‌టి నుంచో అనుకొంటున్నారు. ఇది వ‌ర‌కు వీరి కాంబోలో ఓ సినిమా రాబోతోంద‌న్న వార్త‌లు కూడా హ‌ల్ చ‌ల్ చేశాయి. అంతా ఓకే అనుకొన్న త‌రుణంలో.....

ఎక్స్ క్లూజీవ్‌: ముగ్గురు హీరోయిన్ల‌తో ప్ర‌భాస్ పాట‌

ఓ మాస్ హీరో ప‌క్క‌న ఇద్ద‌రు హీరోయిన్లు డాన్స్ చేస్తే... ఆ మజానే వేరు. అలాంటిది ముగ్గురు హీరోయిన్లు చిందేస్తే... థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవ‌డం ఖాయం. అలాంటి బ్లాస్ట్ ఒక‌టి 'రాజా సాబ్‌'లో ఉంది....

కడపలో వీధి వీధికి వైఎస్ ఫ్యామిలీ వార్ !

కడప ఎన్నికల బరి ఎవరూ ఊహించనంత కొత్త మలుపులు తిరుగుతోంది. వైఎస్ కుటుంబ సభ్యులంతా రెండు వర్గాలుగా విడిపోయి ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ , అవినాష్ రెడ్డి కోసం ...

నాగ్ చేతి నిండా మ‌ల్టీస్టార్ల‌ర్లే!

సీనియ‌ర్ హీరోలు పంథా మార్చుకొంటున్నారు. సినిమా అంతా త‌మ భుజాల‌పైనే న‌డ‌వాల‌ని కోరుకోవ‌డం లేదు. క‌థ‌లో భాగం అయితే చాల‌నుకొంటున్నారు. అందుకే వాళ్ల‌కు మంచి పాత్ర‌లు ద‌క్కుతున్నాయి. నాగార్జున కూడా అదే బాట‌లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close