షరతుల్లేకుండానే రాజ్యసభలోనూ వ్యవసాయ బిల్లుకు వైసీపీ మద్దతు..!

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతున్న సమయంలో.. వైసీపీ బీజేపీకి అండగా నిలిచింది. ఎన్డీఏ పక్షంలోని పార్టీలే ఆ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఎన్డీఏ నుంచి వైదొలుగుతున్న సమయంలో.. వైసీపీ ఎలాంటి మొహమాటాలు పెట్టుకోలేదు. తాము మద్దతిస్తున్నామని రాజ్యసభలో జరిగిన చర్చలో విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఈ బిల్లుల వల్ల రైతులు ఎదుర్కొంటున్న మద్దతు ధర, గిట్టుబాటు ధర సమస్య పరిష్కారం అవుతుందని విజసాయిరెడ్డి ప్రకటించారు. వైసీపీకి రాజ్యసభలో ఆరుగురు సభ్యులు ఉన్నారు. వారి మద్దతు ప్రస్తుతం బీజేపీకి ఎంతో కీలకం. అకాలీదళ్‌తో పాటు ఇంత కాలం ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో సహకరిస్తున్న టీఆర్ఎస్ లాంటి పార్టీలు వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించుకున్నాయి. దీంతో వైసీపీ మద్దతు బీజేపీకి కీలకంగా మారింది.

రాజ్యసభలో కేంద్రానికి ఎంపీల అవసరం వచ్చినప్పుడు.. రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేకహోదా వంటిఅంశాలపై పట్టుబట్టి సంతకం పెట్టిన తర్వాతనే మద్దతిస్తామని జగన్మోహన్ రెడ్డి అదే పనిగా చెప్పేవారు. ఇప్పుడు ఎలాంటి షరతుల్లేకుండా.. మద్దతిచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే .. రాజధాని భూములు, ఫైబర్ నెట్‌ వంటి వాటిపై సీబీఐ విచారణ జరిపించాలనే అంశాలపై వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఈ దిశగా రాజకీయంగా ఉపయోగపడే అంశాలపై వారు అంతర్గతంగా మాట్లాడుకుని ఉంటారన్న చర్చ ఢిల్లీలో జరుగుతోంది.

వ్యవసాయ బిల్లులు రైతుల కష్టాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టేలా ఉన్నాయన్న విమర్శలు దేశవ్యాప్తంగా వస్తున్నాయి. ఆందోళనలు కూడా పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ఇప్పుడిప్పుడే దక్షిణాదికి కూడా.. ఆ ఆందోళనలు విస్తరిస్తున్నాయి. అయినప్పటికీ.. వైసీపీ రైతుల ఆందోళనల్ని ఏ మాత్రం పట్టించుకోకుండా.. కేంద్రానికి మద్దతిచ్చేందుకు సిద్ధమయింది. గతంలో ఎన్నార్సీ బిల్లుకు కూడా అలాగే మద్దతిచ్చింది. రాష్ట్రంలో ఆందోళనలు పెరిగే సరికి.. వ్యతిరేకిస్తామని సీఎం జగన్ ప్రకటించారు. బిల్లుకు మద్దతుగా ఓటేసిన తర్వాత వ్యతిరేకించడం ఏమిటో.. చాలా మందికి అర్థం కాలేదు. కానీ అదే రాజకీయం. ఇప్పుడు వ్యవసాయబిల్లు విషయంలోనూ రైతుల ఆందోళనలు పెరిగిపోతే.. తర్వాత అదే చెప్పే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close