కోదండరాం ఎమ్మెల్సీ కాకుండా టీఆర్ఎస్ వ్యూహం..!

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ సన్నద్ధమవుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ ప్రయత్నాలు చేపట్టింది. ఇందులో భాగంగా పార్టీ శ్రేణులతో కేటీఆర్‌ టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై టీఆర్‌ఎస్‌ నేతలకు దిశానిర్ధేశం చేశారు. త్వరలో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ యాక్షన్‌ ప్లాన్‌ ప్రారంభించింది. కొత్త ఓటర్లను నమోదు చేసేందుకు ఇప్పటికే జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జ్‌లను నియమించింది. ఉమ్మడి వరంగల్- ఖమ్మం- నల్గొండ జిల్లాల ఓటరు నమోదు ఇన్‌చార్జ్‌లు, నేతలతో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ప్రత్యేకంగా సమీక్షలు నిర్వహిస్తున్నారు.

అక్టోబర్ ఒకటి నుంచి జరగబోయే గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదుకు ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ నేతలను కేటీఆర్‌ ఆదేశించారు. ఓటరు నమోదు కార్యక్రమాన్ని పెద్దసంఖ్యలో చేపట్టాలని సూచించారు. కేటీఆర్ ఈ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ స్థానంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. దానికి కారణం అక్కడ్నుంచి కోదండరాం ఎమ్మెల్సీగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. వరంగల్- ఖమ్మం- నల్గొండ జిల్లాల నుంచి పట్టభద్రుల ప్రతినిధిగా కోదండరాం శాసనమండలిలోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు వివిధ రాజకీయ పార్టీల మద్దతు కూడా కోరుతున్నారు. అయితే.. కోదండరాం ఒక్క సారిగా ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే.. ఆయనకు వచ్చే మైలేజీ వేరుగా ఉంటుంది.

తెలంగాణ ఉద్యమంలో.. ఆయన పాత్ర ఎవరూ మరువలేనిది. అందుకే.. వీలైనంత వరకూ.. కోదండరాంకు ప్రజా మద్దతు లేదని తేల్చాలని కేటీఆర్ నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. అయితే.. గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు భిన్నంగా జరుగుతూ ఉంటాయి. విద్యావంతులు ఎక్కువగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు వేస్తూంటారు. పైగా.. ఉద్యమంలో కోదండరాంతో అనుబంధం ఉన్న యువతే ఎక్కువ. మరి కేటీఆర్ ప్రయత్నాలు ఫలిస్తాయో.. లేదో ..!?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గాజు గ్లాస్ జనసేనకు మాత్రమే !

వైసీపీ నేతల ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఇండిపెండెంట్లుగా తమ వారిని నిలబెట్టి వారికి గాజు గ్లాస్ గుర్తు ఇప్పించుకోవాలని చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిలయ్యాయి. గాజుగ్లాస్ గుర్తును జనసేన పార్టీకి రిజర్వ్ చేస్తూ...

ఓటేస్తున్నారా ? : ల్యాండ్ టైటింగ్ యాక్ట్ గురించి తెలుసుకోండి !

ఆంధ్రప్రదేశ్ లో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎవరు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల బతుకుల్ని ప్రభావితం చేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఏముందిలే...

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close