బాలుకి క‌రోనా ఎలా… ఎప్పుడు సోకింది?

క‌రోనా సోకి బాలు ఆసుప‌త్రి పాల‌వ్వ‌డం, ఆ త‌ర‌వాత క్ర‌మంగా ఆయ‌న ఆరోగ్యం క్షీణించ‌డం – క‌రోనా నుంచి కోలుకున్నా, ఇత‌ర ఆరోగ్య స‌మ‌స్య‌ల వ‌ల్ల‌, బాలు ప‌రిస్థితి చేయి జారిపోవ‌డం ఇవ‌న్నీ తెలిసిన విష‌యాలే. బాలు లాంటి వ్య‌క్తులు ఆరోగ్య‌ప‌రంగా చాలా జాగ్ర‌త్త‌గా ఉంటారు. క‌రోనా విజృంభిస్తున్న వేళ‌.. బాలు అన్నిర‌కాల జాగ్రత్త‌లూ తీసుకున్నారు. క‌చేరీలు పూర్తిగా త‌గ్గించేశారు. బ‌య‌ట‌కు వెళ్లినా – అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌ల‌తోనే వెళ్లేవారు. అయినా స‌రే, ఆయ‌న‌కు క‌రోనా సోకింది. దాంతో బాలుకి అస‌లు క‌రోనా ఎలా సోకింది? దానికి కార‌ణం ఏమిటి? అనే విష‌యాలు ఆరా తీస్తున్నారంతా.

ఓ టీవీ ఛాన‌ల్ కోసం బాలు సంగీత ధారావాహిక నిర్వ‌హిస్తున్నారు. దానికి సంబంధించిన షూటింగ్ హైద‌రాబాద్‌లోనే జ‌రుగుతుంది. బాలు ప్ర‌తీసారి చెన్నై నుంచి హైద‌రాబాద్ కి రావ‌డం ప‌రిపాటి. అయితే క‌రోనా వ‌ల్ల ఆయ‌న రావ‌డానికి చాలా భ‌య‌ప‌డ్డారు. కానీ టీవీ ఛాన‌ల్ వాళ్లు ప‌దే ప‌దే ఫోన్ చేసి `పోగ్రాంకి రావాల్సిందే` అని ఒత్తిడి చేయ‌డంతో, ఆయ‌న కాద‌న‌లేక‌.. హైద‌రాబాద్ వ‌చ్చిన‌ట్టు, ఇక్క‌డ మూడ్రోజుల పాటు ఉండి, ఎపిసోడ్స్ పూర్తి చేసిన‌ట్టు తెలుస్తోంది. బాలుతో ప‌నిచేసిన ట్రూప్ లో కొంత‌మందికి క‌రోనా ఉంద‌ని, వాళ్ల ద్వారా బాలుకి క‌రోనా సోకి ఉండొచ్చ‌ని తెలుస్తోంది. హైద‌రాబాద్ నుంచి చెన్నై వెళ్లాక బాలు కి క‌రోనా సోకింద‌ని నిర్దార‌ణ అయ్యింద‌ని స‌న్నిహితులు చెబుతున్నారు. అలా… బాలు క‌రోనా బారీన ప‌డాల్సివ‌చ్చింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్నికల్లో ప్రజలకు పరీక్ష పెడుతోన్న జగన్ రెడ్డి..!?

ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలను జగన్ రెడ్డి పరిక్షీస్తున్నట్టు ఉంది. సొంత చెల్లి మీడియా ముంగిటకు వచ్చి జగన్ నిజస్వరూపం బయటపెడుతున్నా నిజాన్ని నిందగా చిత్రీకరించుకుంటూ జనం మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుండటం...

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close