న్యాయవ్యవస్థపై పోరాడే మొనగాళ్లు ప్రత్యేక హోదా కోసం పోరాడలేరా అంటూ విమర్శలు

వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్ పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు, న్యాయవ్యవస్థను కేంద్రంగా చేసుకుని, న్యాయవ్యవస్థను ముద్దాయిగా చిత్రీకరిస్తూ చేసిన ఆరోపణలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. వీటిని ఆ పార్టీ అభిమానులు సమర్థిస్తూ ఉంటే, ఇతర పార్టీల అభిమానులతో పాటు తటస్థుల లో మెజారిటీ భాగం కూడా దీనిని విమర్శిస్తున్నారు. అయితే ఈ సమర్థన- విమర్శలతో పాటు మరికొన్ని కొత్త వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా న్యాయవ్యవస్థపై చేసిన ఆరోపణల పై కొందరు విశ్లేషకులు – జగన్ కి సంబంధించిన కేసులలో త్వరలోనే పురోగతి ఉండనుందని, ప్రత్యేకించి దేశ వ్యాప్తంగా రాజకీయ నాయకుల పై ఉన్న కేసులను రాబోయే తొమ్మిది నెలల్లో విచారణ వేగవంతం చేయాలనే ప్రతిపాదనల కారణంగా, జగన్ కేసు కూడా అటో ఇటో తేలిపోతుందని, అందుచేతనే జగన్ న్యాయ వ్యవస్థ పై ఈ విమర్శల పర్వానికి తెర తీశారని అభిప్రాయపడుతున్నారు. అయితే జగన్ అభిమానులు, ఆ పార్టీ వకాల్తా పుచ్చుకునే మీడియా మాత్రం – జగన్ న్యాయవ్యవస్థపై గురిపెట్టి చాలా గొప్ప సాహసం చేస్తున్నాడు అని, ఆయన గొప్ప ధీరుడు అని, వ్యాసాలు రాస్తున్నారు.

అయితే జగన్ గొప్ప ధీరుడు కావడం కారణంగానే న్యాయ వ్యవస్థ పై పోరాటం మొదలు పెట్టాడు అన్న జగన్ మీడియా కథనాల పట్ల ప్రజలలో సానుకూల స్పందన రావడం లేదు. నిజంగా అంత ధీరుడే అయి ఉంటే, ప్రత్యేక హోదా కోసమో, ప్రజా ప్రయోజనాల కోసమో కేంద్రంతో పోరాడి ఉంటే ప్రజల్లో మరింత మైలేజ్ వచ్చి ఉండేదని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేక హోదా కోసం కానీ, ప్రత్యక్షంగా ప్రజలతో ముడిపడిన వేరే ఏదైనా ప్రయోజనాల కోసం కానీ పోరాడకుండా, తనపై ఉన్న కేసులు విచారణ జరుగుతున్న సమయంలో న్యాయవ్యవస్థపై పోరాడుతున్న కారణంగా, కేవలం కేసుల నుండి బయట పడే ఉద్దేశ్యంతోనో, లేదంటే కేసుల నుండి బయటపడలేని పక్షంలో కుట్రపూరితంగా తనను జైలుకు పంపించారని సానుభూతి పిండుకునే ఉద్దేశ్యంతోనో జగన్ న్యాయవ్యవస్థపై ఆరోపణల పర్వానికి తెర తీశారని మెజారిటీ ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.

ఎలాగూ పోరాటం అంటూ జగన్ మొదలు పెట్టాడు కనుక కనీసం ఇప్పుడైనా ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో నిజమైన పోరాటం చేస్తాడా, లేదంటే సరిగ్గా ఎన్నికలకు ముందు ఎంపీలతో రాజీనామా చేయడం వంటి తూతూ మంత్రం చర్య లతో సరిపెడతారా అన్నది వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close