విశాఖ రోడ్ల గురించే గడ్కరీని అడిగిన సీఎం..!

ముఖ్యమంమత్రి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అవకాశం దొరికినా…విశాఖ ను ప్రమోట్ చేయడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. తాజాగా దుర్గగుడి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం వర్చువల్ పద్దతిలోజరిగింది. ఈ ప్రారంభోత్సవరంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి.. గడ్కరీకి విశాఖ ప్రాజెక్టుల గురించి ప్రత్యేకమైన విజ్ఞప్తులు చేశారు. విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా అభివృద్ధి చేస్తున్నామని… అందుకే అక్కడ రోడ్డు ప్రాజెక్టులు చేపట్టాలని గడ్కరీని జగన్‌ కోరారు. బోగాపురంలో ప్రపంచ స్థాయి ఎయిర్ పోర్టు వస్తోందని.. విశాఖ నుంచి బోగాపురం ఎయిర్‌పోర్టు వరకు రహదారిని విస్తరించాలని విజ్ఞప్తి చేశారు.

విశాఖలో రోడ్ల అభివృద్ధి బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలన్నారు. బీచ్‌ రోడ్డును కూడా అభివృద్ధి చేయాలని గడ్కరీని జగన్‌ కోరారు. మూడు రాజధానుల బిల్లు విషయం ఇంకా క్లారిటీ రాలేదు. కోర్టులో ఉంది. అయినప్పటికీ విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గానే జగన్మోహన్ రెడ్డి ప్రమోట్ చేస్త్తున్నారు. ఎవరేమనుకున్నా ఆయన వెనక్కి తగ్గడం లేదు. భారీ ఎత్తున స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మిస్తున్నారు.

బోగాపురం ఎయిర్ పోర్టు కు గత ప్రభుత్వం కేటాయించిన స్థలాల నుంచి ఐదు వందల ఎకరాలు వెనక్కి తీసుకుని అక్కడ ఎలాంటి సిటీ కట్టవచ్చో… ఆర్కిటెక్చర్ నిపుణులతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో… కేంద్రం నుంచి ప్రాజెక్టులను కూడా విశాఖ కోసమే అడుగుతున్నారు జగన్. ఇతర ప్రాంతాల్లోని రోడ్ల ప్రాజెక్టుల ప్రతిపాదనలను సీఎం ఎందుకు గడ్కరీ ముందు పెట్టలేదని.. ఒక్క విశాఖపైనే ఎందుకు మొత్తం దృష్టి కేంద్రీకరిస్తున్నారన్న చర్చ వైసీపీ నేతల్లో నడుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close