తనపై ఆ కేసును ఎత్తి వేయించుకున్న సీఎం జగన్..!

ముఖ్యమంత్రి జగన్ తనపై 32 క్రిమినల్ కేసులు ఉన్నాయని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్ని తప్పు అని నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు రాసిన లేఖ నేపధ్యంలో అందరూ.. జగన్‌పై ఉన్న క్రిమినల్ కేసుల రికార్డును ఎత్తిచూపుతున్నారు. ఈ క్రమంలో ఆ కేసుల సంఖ్యను తగ్గించడానికి ప్రభుత్వం తరపున ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ముందుగా.. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కృష్ణా జిల్లా కలెక్టర్‌పై రుబాబు చేసిన వ్యవహారంపై నమోదైన క్రిమినల్ కేసును ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. గుట్టుగా సాగిపోయిన ఈ వ్యవహారం ఇప్పుడు.. చర్చనీయాంశం అవుతోంది.

దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు.. హైదరాబాద్ నుంచి వస్తూ.. కృష్ణా జిల్లాలో ప్రమాదానికి గురైంది. పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. ఆ సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మృతదేహాలకు పోస్టుమార్టం జరుగుతున్న ఆస్పత్రికి వెళ్లారు. పోస్టుమార్టం రూంలోకి దూసుకెళ్లి డాక్టర్ల చేతుల్లో ఉన్న పోస్ట్ మార్టం కాగితాలను లాక్కున్నారు.ఆ తర్వాత అప్పట్లో కృష్ణా జిల్లా కలెక్టర్‌గా ఉన్న అహ్మద్‌బాబుపై విరుచుకుపడ్డారు. నిన్ను సెంట్రల్ జైల్‌కు పంపిస్తానని హెచ్చరించారు. ఇవన్నీ వీడియో సహితంగా బహిరంగంగా ఉన్న సాక్ష్యాలే. ఈ ఘటనపై అప్పట్లో అధికారులు కేసు నమోదు చేశారు. క్రిమినల్ నేరం కావడంతో ఆ సెక్షన్ల కిందనే కేసు నమోదు చేశారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ కేసును ఎత్తివేశారు.

ఈ కేసును ఎత్తివేయడానికి ప్రభుత్వం వినూత్నమైన మార్గాన్ని ఎంచుకుంది. అక్కడ సీఎం జగన్ తప్పేమీ లేదని.. తామే భ్రమపడ్డామని.. అధికారులతో రిపోర్ట్ తయారు చేయించారు. ఎట్టకేలకు పని పూర్తి చేయించారు. జగన్ వ్యవహారశైలి చాలా స్పష్టంగా వీడియోల్లో ఉంది. ఆయన చేయలేదని.. ఆయన ఉద్దేశపూర్వకంగా చేయలేదని అధికారులు ఇప్పుడు అనడం వెనుక.. అధికార కేంద్రం ఉందని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. అవకాశం వస్తే.. తనపై ఉన్న సీబీఐ కేసుల్ని కూడా జగన్ రద్దు చేయించుకుంటారని టీడీపీ నేతలు సెటైర్లు ప్రారంభించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రారంభమైన పోలింగ్…బరిలో ప్రముఖులు వీరే..!

లోక్ సభ ఎన్నికల్లో భాగంగా కాసేపటి క్రితం నాలుగో విడత పోలింగ్ ప్రారంభమైంది. 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 96 పార్లమెంట్ సెగ్మెంట్లలో సోమవారం పోలింగ్ జరుగుతోంది. తెలంగాణలోని మొత్తం 17, ఏపీలోని...

సీఐ అంజూ యాదవ్‌నూ సాగనంపారు !

తిరుపతిలో అత్యంత వివాదాస్పదమైన మహిళా సీఐ అంజూ యాదవ్ ను కూడా ఈసీ సాగనంపింది. పోలింగ్ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లో ఉండకూదని ఆర్థరాత్రే బదిలీ చేస్తూ ఈసీ ఉత్తర్వులు...

అల్లు అర్జున్ టూర్ : నంద్యాల ఎస్పీ, డీఎస్పీ, సీఐలపై ఈసీ చార్జ్‌షీట్

అల్లు అర్జున్ నంద్యాల పర్యటన పోలీసులపై కూడా కేసులు నమోదయ్యేలా చేసింది. అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు పోలీసులు అనుమతి తీసుకోలేదు. మామూలుగా అయితే పెద్దగా మ్యాటర్ కాదు....

వారణాశిలో మోడీ నామినేషన్‌కు చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును వారణాశిలో తన నామినేషన్ కు రావాల్సిందిగా ప్రధాని మోడీ ఆహ్వానించారు. మంగళవారం ప్రధాని మోద ీనామినేషన్ వేయనున్నారు. వారణాశిలో ఎన్నికలు చివరి విడతలో జరగున్నాయి. పదమూడో తేదీన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close