ఆ సిట్‌పై స్టే ఎత్తేయడానికి సుప్రీం నో..!

గత ప్రభుత్వ నిర్ణయాలన్నింటినీ సమీక్షించి తప్పులు ఉంటే కేసులు నమోదు చేసేందుకు ఏర్పాటు చేసిన సిట్ పై ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేని ఎత్తివేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.  సెప్టెంబర్‌లో హైకోర్టు ఇచ్చిన స్టే పై ఏపీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీన్ని జస్టిస్ అశోక్ భూషణ్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. ప్రతివాదులు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్, సిట్, డీజీపీకి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు..   నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. స్టే పై తదుపరి విచారణలో తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. అమరావతి భూముల విషయంలో సీబీఐ దర్యాప్తు కోరామని కేంద్రం నుంచి ఎటువంటి స్పందన రాలేదని ఏపీ ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. 

హైకోర్టు టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమీక్షించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ ఇచ్చిన జీవో, దాని సిఫారసు మేరకు సమగ్ర దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం ను ఏర్పాటు చేస్తూ ఇచ్చిన జీవోలపై స్టే విధిచింది. ప్రభుత్వం చెబుతున్న నేరాలకు సంబంధించి దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదని, మంత్రివర్గ ఉపసంఘం, సిట్‌ ఏర్పాటు, కొనసాగింపును సమర్థించే ఆధారాలేవీ లేవని అప్పట్లో హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎప్పుడైనా ఫిర్యాదు చేశాకే నేరం నమోదవుతుందని.. కానీ ఇక్కడ నేరం నమోదు కావడానికి ముందే దర్యాప్తు చేయడంతో పాటు ఆయా నేరాలను విభాగాలుగా మార్చడం దగ్గర్నుంచి  ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు అభ్యర్థించడం వంటివన్నీ లోపభూయిష్టమేనని హైకోర్టు ఆక్షేపించింది. 

  

ఎక్కడైనా ఎఫ్ఐఆర్‌ నమోదు చేశాక దర్యాప్తు చేస్తారు. కానీ ఇందుకు పూర్తి విరుద్ధంగా గత ప్రభుత్వంలోని కొంతమందిని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో సిట్‌ ఏర్పాటు చేశారని పిటిషనర్లు వాదించారు.  సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉన్న ఆ జీవోలను రద్దు చేయాలని వారు కోరారు. నాలుగు వారాల తర్వాత సుప్రీంకోర్టులో జరిగే విచారణతో ఈ సిట్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

విశ్వసనీయత కోల్పోతున్న కేసీఆర్…?

అనేక ఆటుపోట్లను ఎదుర్కొని రెండుసార్లు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి తెలంగాణలో బీఆర్ఎస్ ను తిరుగులేని శక్తిగా నిలిపిన కేసీఆర్ ప్రస్తుతం రాజకీయాల్లో విశ్వసనీయత కోల్పోతున్నారా..?ఇందుకు కారణం ఆయన వరుసగా చేస్తోన్న వ్యాఖ్యలేనా..? అంటే...

ప్ర‌భాస్ ‘ఫ్రీ’గా చేస్తున్నాడా?

మంచు విష్ణు ఏం మంత్ర‌మేశాడో ఏమో, 'క‌న్న‌ప్ప‌' కోసం చాలామంది స్టార్ల‌ని త‌న టీమ్ లోకి తీసుకొన్నాడు. అందులో ప్ర‌భాస్ ఒక‌డు. ఈరోజుల్లో ప్ర‌భాస్ తో సినిమాలో ఓ పాత్ర చేయించ‌డం ఏమంత...

బీఆర్ఎస్ కొంపముంచనున్న క్రాస్ ఓటింగ్..?

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో లోక్ సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ కు ఈ ఎన్నికల్లోనూ పరాభవం తప్పదా..? హోరాహోరీ పోరులో బీఆర్ఎస్ ను క్రాస్ ఓటింగ్ దారుణంగా దెబ్బతీయనుందా..? అంటే అవుననే...

రూ. 14 వేల కోట్లు లబ్దిదారుల ఖాతాల్లో వేస్తారా ? లేదా ?

పోలింగ్ ముగిసింది. ఇప్పుడు గత ఆరు నెలలకు ఏపీ ప్రజలకు ఆపిన పథకాల డబ్బులను ఏపీ ప్రభుత్వం ప్రజల ఖాతాల్లో వేస్తుందా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. పోలింగ్ కు మందు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close