గ్రేటర్‌కు గురి పెట్టి ముగ్గురికి ఎమ్మెల్సీలు..!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలు అనూహ్యంగా ఉంటాయి. దుబ్బాక ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన అనూహ్యంగా వేగం పెంచారు. గ్రేటర్ ఎన్నికలను వెంటనే నిర్వహించాలని గ్రౌండ్ క్లియర్ చేసుకోవడమే కాదు.. ఏదైనా సీట్లు తేడా పడితే.. మేయర్ సీటును దక్కించుకోవడానికి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. శరవేగంగా క్యాబినెట్ భేటీలో ఆమోదం తీసుకున్నారు. శనివారమే ముగ్గురితో ప్రమాణ స్వీకారం చేయించాలని నిర్ణయించారు.

కొత్త ఎమ్మెల్సీలుగా ప్రజా కవి గోరెటి వెంకన్న, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్ లను కేసీఆర్ ఎంపిక చేశారు. గోరటి వెంకన్న.. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. తన పాటలతో ఆయన ప్రజలను చైతన్యవంతం చేశారు. నేరుగా ఆయన టీఆర్ఎస్‌లో చేరకపోయినప్పటికీ.. ఉద్యమకారులకు గుర్తింపు ఇచ్చే ఉద్దేశంతో కేసీఆర్ ఆయనకు చాన్సిచ్చారు. మాజీ మంత్రి బస్వరాజు సారయ్య… టీఆర్ఎస్‌లో చేరినప్పటికీ.. పోటీ చేసే అవకాశం రాలేదు. పార్టీలో చేరినప్పుడు ఇచ్చిన హామీ మేరకు.. ఆయనకు ఎమ్మెల్సీ స్థానం ఇచ్చారు. పార్టీలో చాలా కాలం నుంచి పని చేస్తున్న ఆర్యవైశ్య సంఘం నాయకుడు బొగ్గారపు దయానంద్ కు కేసీఆర్ అనూహ్యంగా అవకాశం కల్పించారు.

ఇంత హఠాత్తుగా ముగ్గురు ఎమ్మెల్సీల్ని ఖరారు చేయడం.. ప్రమాణస్వీకారం చేయడం వెనుక.. గ్రేటర్ ఎన్నికల వ్యూహం ఉంది. వీరు ముగ్గుర్ని గ్రేటర్ ఖాతాలో ఎక్స్ అఫీషియో ఓటర్లుగా చూపాలని కేసీఆర్ వ్యూహం సిద్ధం చేసుకున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో మేయర్ స్థానానికి ఏమైనా ఓట్లు తక్కువ పడితే వీరి ఓట్లతో గట్టెక్కవచ్చన్న వ్యూహాన్ని అమలు చేస్తున్నారని అంటున్నారు. దీపావళి ముగిసిన తర్వాత రోజే… గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్న ప్రచారం జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close