చిరు వ్యాపారులకు పెట్టుబడి తోడు..!

చిరు వ్యాపారులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రూ.పదివేల పూచీకత్తు లేని అప్పు ఇప్పిస్తున్నారు. కోవిడ్ కారణంగా ఐదారు నెలల పాటు తోపుడు బండ్లపై చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు.. బడ్డీ కొట్లు పెట్టుకున్నవారు తీవ్రంగా నష్టపోయారు. వారికి ఇప్పుడు.. పెట్టుబడి సాయం అవసరం కాబట్టి.. ముఖ్యమంత్రి జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే.. చాలా మంది చిన్న వ్యాపారులు..రోజువారీ వడ్డీలకు తీసుకుంటూ ఉంటారు. వారందరికీ రుణవిముక్తి కల్పించడానికి రూ. పదివేల రుణం ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. తన క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్ మీట నొక్కి.,. ముఖ్యమంత్రి జగన్ డబ్బులను బదిలీ చేస్తారని ప్రభుత్వం ప్రకటించింది.

రోడ్డు పక్కన రోజువారీ వ్యాపారాలు చేసేవారు, తోపుడు బండ్లు, చిన్న చిన్న కూరగాయల వ్యాపారులు, రోడ్ల పక్కన టిఫిన్, టీ స్టాల్స్, చిన్న దుకాణదారులు ఈ రుణానికి అర్హులు. వీరితో పాటు చేతి వృత్తి దారులైన లేస్‌ వర్క్, కలంకారీ, ఏటికొప్పాక బొమ్మలు, తోలు బొమ్మల తయారీదారులు, కళాకృతులతో కూడిన కుండల తయారీదారులు, బొబ్బిలి వీణలు, కంచు విగ్రహాలు, కళాత్మక వస్తువుల తయారీదారులు వంటి సంప్రదాయ వృత్తి కళాకారులకు సైతం వడ్డీ లేకుండా బ్యాంకుల నుంచి రూ.పది వేలు రుణం లభిస్తుంది.

ఇప్పటికే లబ్ధిదారులను ఎంపిక చేశారు. మంజూరు పత్రాలనుసిద్ధం చేశారు. చిరు వ్యాపారం ప్రారంభించాలనుకున్న వారికీ రుణాలందిస్తారు. అయితే జగనన్న తోడు పథకం కింద.. ప్రభుత్వం రుణం ఇవ్వడం లేదు. బ్యాంకుల ద్వారా ఇప్పిస్తున్నారు. లబ్ధిదారుడు తాను తీసుకున్న రుణాన్ని వడ్డీతో సహా బ్యాంకులకు చెల్లించిన తర్వాత, సదరు వడ్డీని ప్రభుత్వం లబ్ధిదారుడికి రీయింబర్స్‌ చేస్తుంది. బ్యాంకులు సహకరించడం మీదే మొత్తం ఆధారపడి ఉంది. జగన్మోహన్ రెడ్డి మీట నొక్కినప్పటికీ లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు పడే అవకాశం లేదు. బ్యాంకులు మంజూరు చేయాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close