పీవీ, ఎన్టీఆర్‌లకు కాషాయం పూసేసిన బండి సంజయ్..!

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పొలిటికల్‌గా ఫుల్‌ఫామ్‌లో ఉన్నారు. గ్రేటర్ ఎన్నికల మొత్తం షెడ్యూల్ కేవలం రెండు వారాలు. అయినా సరే.. కానీ టీ ట్వంటీ మ్యాచ్ ఆడుతున్నట్లుగా బండి సంజయ్ ప్రచార బ్యాటింగ్ చేస్తున్నారు. వచ్చిన ప్రతీ అవకాశాన్ని పక్కగా ఉపయోగించుకుంటున్నారు. నామినేషన్ల పర్వమప్పుడు.. వరద సాయం ఆపడానికి బండి సంజయే కారణం అంటూ తన పేరుతో టీఆర్ఎస్ సృష్టించిన ఓ ఫేక్ లెటర్‌తో ఆయన కంగారు పడలేదు. దాన్నే అస్త్రంగా చేసుకుని పార్టీని పాతబస్తీ తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అదే చర్చనీయాంశం అయింది. ఆ తర్వాత కూడా ఆయన దూకుడు ఎక్కడా తగ్గడం లేదు. నిర్మోహమాటంగా తాను హిందూత్వ వాదినేనని చెప్పుకుంటూ.. మజ్లిస్‌పై డైరక్ట్ ఎటాక్ చేస్తున్నారు.

పాతబస్తీపై సర్జికల్ స్ట్రయిక్స్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. టీఆర్ఎస్ ఈ ట్రాప్‌లో పడింది. దీన్ని వివాదాస్పదం చేయాలనుకున్నారు కానీ.. అది మరో విధంగా హైలెట్ అయింది. ఈ సారి అక్బరుద్దీన్.. బండి సంజయ్ కు చాన్సిచ్చారు. అనాలోచితంగా పీవీ, ఎన్టీఆర్ ఘాట్ల కూల్చివేత గురించి మాట్లాడారు. ఇక బండి సంజయ్ ఊరుకుంటారా..? నిజానికి ఆ ఇద్దరూ బీజేపీతో సంబంధం లేని వాళ్లే. అలా అని బండి సంజయ్ రిజర్వేషన్లు పెట్టుకోలేదు… రంగంలోకి దిగేశారు. ఇద్దరికీ.. కాషాయం పులిమేసి.. మహానుభావులుగా వాడకం ప్రారంభించేశారు. ఓన్ చేసుకున్నారు. ఎన్టీఆర్ కాషాయ వస్త్రాలు ధరించి పాలన చేశారని కూల్చుతారా?.. అయోధ్య అంశంపై పీవీ స్ఫూర్తిదాయక పాత్ర పోషించారని కూల్చుతారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

పీవీ, ఎన్టీఆర్‌ ఘాట్లకు నివాళులర్పిస్తానని.. మహానాయకుల ఘాట్లకు రక్షణగా ఉంటానని ప్రమాణం చేయబోతున్నారు. అటు టీడీపీ ఫ్యాన్స్‌ని ఇటు పీవీకి మద్దతుగా ఉండే కాంగ్రెస్ ఫ్యాన్స్‌ని బండి సంజయ్ ఏక కాలంలో ఆకట్టుకుంటున్నారు. సాధారణంగా తమ పార్టీకి చెందని వారిని ఇతర పార్టీలు ఓన్ చేసుకోవు. కానీ బీజేపీ స్టైల్ వేరు. సర్దార్ పటేల్ ను బీజేపీ.. ఓన్ చేసుకున్న విధానం చూసి.. బహుశా.. ఆయన బీజేపీ నేత అయి ఉండవచ్చని అనుకునే జనం చాలా మంది ఉన్నారు. ఇప్పుడు.. బండి సంజయ్ పీవీ, ఎన్టీఆర్ విషయంలో అలాంటి వ్యూహమే పాటిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాళ్లు పట్టేసుకుంటున్న వైసీపీ నేతలు -ఎంత ఖర్మ !

కుప్పంలో ఓటేయడానికి వెళ్తున్న ఉద్యోగుల కాళ్లు పట్టేసుకుంటున్నారు వైసీపీ నేతలు. వారి తీరు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కుప్పంలో ప్రభుత్వ ఉద్యోగులు ఓట్లు వేసేందుకు ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు...

‘పూరీ’ తమ్ముడికి ఓటమి భయం?

విశాఖపట్నం జిల్లాలో ఉన్న నర్సీపట్నం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతానికి నర్సీపట్నం 'హార్ట్' లాంటిది, ఇక్కడ రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. తెలుగుదేశం పార్టీ సీనియర్...

మదర్స్ డే @ 200 సంవత్సరాలు

ప్రతి ఏడాది మే రెండో ఆదివారం మదర్స్ డే గా జరుపుకుంటారని మనకు తెలుసు.. అయితే ఈ ప్రతిపాదన మొదలై 200 సంవత్సరాలు అయిందనే విషయం మీకు తెలుసా? వాస్తవానికి 'మదర్స్ డే వేడుకలు'...

కోమటిరెడ్డికి హైకమాండ్ వద్ద రిమార్క్స్

కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందని రేవంత్ రెడ్డి ఉబ్బేస్తున్నారు కానీ ఆయన పనితీరుపై హైకమాండ్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. చెప్పిన పని చేయకుండా నల్లగొండ పార్లమెంట్ పరిధిలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close