కేసీఆర్‌కు భయపడే బీజేపీ బలగం దిగిందా..!?

తెలంగాణ సీఎం కేసీఆర్.. బీజేపీ అగ్రనేతలందరూ హైదరాబాద్‌కు క్యూ కట్టడాన్ని తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. తన జాతీయ రాజకీయ దృక్పథం..వారి వెన్నులో వణుకు పుట్టిస్తోందని.. తానుఢిల్లీ వస్తే వారి కుర్చీ కిందకు నీళ్లు వస్తాయన్న కారణంగానే.. తనను ఆపడానికే వారందరూ.. హైదరాబాద్ తరలి వస్తున్నారన‌్నట్లుగా చెప్పడం ప్రారంభించారు. ఇది వినే వారికి కాస్త అతిశయోక్తిగానే అనిపిస్తోంది. బీజేపీ నేతలు ఎద్దేవా చేయడానికి అస్త్రగా మారుతోంది. ఎందుకంటే.. కేసీఆర్ ఇంత వరకూ జాతీయ రాజకీయాల జోలికే వెళ్లలేదు. గత ఎన్నికలకు ముందు బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలన్నీ జట్టు కడితే.. కేసీఆర్ ఆ జట్టు జోలికి కూడా వెళ్లలేదు. ఇప్పుడు.. బీజేపీకి వ్యతిరేకంగా యుద్ధం చేస్తానని చెబుతున్నారు.

కేసీఆర్ జాతీయ పార్టీ గురించి తరచూ చర్చలు జరుగుతూ ఉంటాయి. ఆయన వర్గం మీడియాకు లీకులు ఇస్తూ ఉంటుంది. గతంలో నయా భారత్ పేరుతో కొత్త పార్టీని కన్ఫర్మ్ చేశారని..ఈ పార్టీని రిజిస్టర్ చేసేందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారన్న ప్రచారం జరిగింది. కానీ కేసీఆర్ మాత్రం అదేం లేదన్నారు. కానీ తరచూ.. తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని.. కొత్త పార్టీ అవసరం ఉందని చెబుతూ ఉంటారు. తానే ఆ కొత్త పార్టీ పెడతానన్నట్లుగా చెబుతూ ఉంటారు. అలాంటి ప్రకటనలను. గ్రేటర్ లాంటి ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి ఉపయోగించుకుంటున్నారు. తనను ఆపడానికే బీజేపీ నేతలు ప్రచారానికి వస్తున్నారని చెప్పడం ప్రారంభించారు.

ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో ఎవరికీ స్కోప్ లేదు. మొత్తం మోడీ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఆయనను ఎదిరించిన ఎవరైనా.. ఆయారాష్ట్రాల్లో బీజేపీకి బలం లేకపోయినా.. అధికారం కోల్పోయి ఇంట్లో కూర్చోవాల్సి వస్తోంది. అన్ని చోట్లా అదే జరిగింది. అందుకే.. చాలా మంది ప్రాంతీయ పార్టీల నేతలు ఆయన ప్రాపకం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. కేసీఆర్ కూడా.. నిన్నామొన్నటిదాకా అంతే. ఇప్పుడే ఆయన జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. బీజేపీ గురించి విమర్శులు చేస్తున్నారు. అప్పుడే ఆయన బీజేపీ తనను టార్గెట్ చేసిందని చెప్పుకోవడం ప్రారంభించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా భాయ్ కి కోపమొచ్చింది… ఛోటా భాయ్ కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close