బాబు స్కీమ్ .. జగనన్న స్కీమ్..! ఏదీ కావాలి..!?

ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుకు పబ్లిసిటీ చేస్తోంది. చంద్రబాబు హయాంలో కట్టిన టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు ఇవ్వకూడదనుకుంటున్న ప్రభుత్వం దానిపై లక్షల్లో రుణం ఉంటుందని చెప్పి భయపెట్టడానికి ప్రయత్నిస్తోంది. అందు కోసం కోట్లు ఖర్చు పెట్టి .. చంద్రబాబు స్కీమ్, జగనన్న స్కీమ్ అంటూ ప్రచారం ప్రారంభించింది. ఫుల్ పేజీ ప్రకటనలు జారీ చేస్తోంది. ఇదంతా.. టిడ్కో ఇళ్ల లబ్దిదారులను గందరగోళ పరిచి.. వారు తమకు ఇళ్లు వద్దు అని చెప్పించడానికన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

అవి చంద్రబాబు ఇళ్లు కాదు.. ప్రభుత్వ ఇళ్లు..!

జగన్ అయినా.. చంద్రబాబు అయినా సొంత డబ్బులతో ఇళ్లు కట్టించలేదు. వారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయలేదు. ప్రజలు పన్నులు కట్టిన సొమ్ముతోనే ఇళ్లను కట్టిస్తున్నారు. దాని ప్రకారం.. వారు పేదలకు ఇళ్లు కట్టిస్తున్నారు. చంద్రబాబు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ఇళ్లు కట్టించారు. నిరుపేదలకు కేటాయించాలని అనుకున్నారు. దాని కోసం లక్షల మంది తమ వంతు సొమ్ము కట్టారు. ఇళ్లు సిద్ధమయ్యాయి. ఇళ్లు కట్టడానికి చంద్రబాబు తన సొమ్ము ఖర్చు చేయలేదు. కాబట్టి ఆయన స్కీమ్ కాదు. అది ప్రభుత్వ స్కీమ్. ప్రజలకు ఉచితంగా ఇచ్చినా.. డబ్బులు వసూలు చేసినా చంద్రబాబుకు వచ్చే నష్టమేం లేదు..లాభమేం లేదు. కానీ.. ఆయన సొంత సొమ్ముతో కట్టించినట్లుగా.. వైసీపీ ప్రచారం చేయడం మాత్రం చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది.

పేదల రుణం రద్దు చేస్తే చంద్రబాబుకు రద్దు చేసినట్లు అవుతుందా..!?

టిడ్కో ఇళ్లు సర్వ సౌకర్యాలతో సిద్ధమయ్యాయి. అవి విలాసంగా కాదు… కేవలం రోజువారీ జీవనానికి అవసరమయ్యే మౌలిక వసతులతో సిద్ధమయ్యాయి. వాటిని లబ్దిదారులకు ఇచ్చి… మిగిలిన వారికి… జగన్ చెప్పినట్లుగా సెంటు స్థలంలో ఇల్లు కట్టివ్వొచ్చు. టిడ్కో ఇళ్ల లబ్దిదారుల రుణాలను మొత్తం మాఫీ చేయవచ్చు. ఇలా మాఫీ చేస్తే ఆ డబ్బులన్నీ చంద్రబాబుకు వెళ్లవు. పేదలకు వెళ్తాయి. పైగా ఇది.. నవరత్నాల హామీ కూడా . తాను వస్తే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా ఇళ్లు ఇస్తానని జగన్ ప్రకటించారు కూడా. ఇప్పటికే తీసుకున్న రుణాలన్నీ రద్దు చేస్తానని కూడా ప్రకటించారు. లబ్దిదారులు కూడా ఆ ఇంటిని చంద్రబాబు ఇచ్చారని చూసుకోరు.. ప్రభుత్వం ఇచ్చిందని చెప్పుకుంటారు. కానీ.. ఆ ఇళ్లపై చంద్రబాబు ముద్ర వేసేందుకు ఏపీ సర్కార్ కోట్లు ఖర్చు పెడుతోంది.

చంద్రబాబు ప్రతిపక్ష నేతగా కూడా ఇళ్లిచ్చేస్తున్నారా..!?

జగన్ 30 లక్షల ఇళ్ల స్థలాలను పంచడానికి సిద్ధమయ్యారు. ఇదో గొప్ప కార్యక్రమమే. కానీ కట్టిన ఇళ్లను ఇవ్వకుండా ఎందుకు.. చంద్రబాబు పేరుతో రాజకీయం చేస్తున్నారన్నది ఎవరికీ అర్థం కాని విషయం. అసలు చంద్రబాబు ప్రస్తావన తీసుకు రాకుండా.. టిడ్కో ఇళ్లను వారికి ఇచ్చి.. వారి రుణాలను రద్దు చేసి… జగనన్న.. వైఎస్ఆర్ కాలనీ పేర్లు పెట్టేసుకుంటే..ఎవరు అడుగుతారు..? లబ్దిదారులు కూడా.. సంతోష పడతారు కదా..! కానీ కోట్లు ఖర్చు పెట్టి రాజకీయం ఎందుకు..? అధికారం పోయిన రెండేళ్ల తర్వాత కూడా.. చంద్రబాబు ఇళ్లిస్తున్నారన్న భావన కల్పించడం ఎందుకు..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !

వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.....

ప్రారంభమైన రెండో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖులు వీరే

సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా శుక్రవారం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగుతున్నాయి. 89లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా...మధ్యప్రదేశ్ బైతూల్ లో బీఎస్పీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close