కేసీఆర్‌కు భయపడే బీజేపీ బలగం దిగిందా..!?

తెలంగాణ సీఎం కేసీఆర్.. బీజేపీ అగ్రనేతలందరూ హైదరాబాద్‌కు క్యూ కట్టడాన్ని తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. తన జాతీయ రాజకీయ దృక్పథం..వారి వెన్నులో వణుకు పుట్టిస్తోందని.. తానుఢిల్లీ వస్తే వారి కుర్చీ కిందకు నీళ్లు వస్తాయన్న కారణంగానే.. తనను ఆపడానికే వారందరూ.. హైదరాబాద్ తరలి వస్తున్నారన‌్నట్లుగా చెప్పడం ప్రారంభించారు. ఇది వినే వారికి కాస్త అతిశయోక్తిగానే అనిపిస్తోంది. బీజేపీ నేతలు ఎద్దేవా చేయడానికి అస్త్రగా మారుతోంది. ఎందుకంటే.. కేసీఆర్ ఇంత వరకూ జాతీయ రాజకీయాల జోలికే వెళ్లలేదు. గత ఎన్నికలకు ముందు బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలన్నీ జట్టు కడితే.. కేసీఆర్ ఆ జట్టు జోలికి కూడా వెళ్లలేదు. ఇప్పుడు.. బీజేపీకి వ్యతిరేకంగా యుద్ధం చేస్తానని చెబుతున్నారు.

కేసీఆర్ జాతీయ పార్టీ గురించి తరచూ చర్చలు జరుగుతూ ఉంటాయి. ఆయన వర్గం మీడియాకు లీకులు ఇస్తూ ఉంటుంది. గతంలో నయా భారత్ పేరుతో కొత్త పార్టీని కన్ఫర్మ్ చేశారని..ఈ పార్టీని రిజిస్టర్ చేసేందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారన్న ప్రచారం జరిగింది. కానీ కేసీఆర్ మాత్రం అదేం లేదన్నారు. కానీ తరచూ.. తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని.. కొత్త పార్టీ అవసరం ఉందని చెబుతూ ఉంటారు. తానే ఆ కొత్త పార్టీ పెడతానన్నట్లుగా చెబుతూ ఉంటారు. అలాంటి ప్రకటనలను. గ్రేటర్ లాంటి ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి ఉపయోగించుకుంటున్నారు. తనను ఆపడానికే బీజేపీ నేతలు ప్రచారానికి వస్తున్నారని చెప్పడం ప్రారంభించారు.

ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో ఎవరికీ స్కోప్ లేదు. మొత్తం మోడీ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఆయనను ఎదిరించిన ఎవరైనా.. ఆయారాష్ట్రాల్లో బీజేపీకి బలం లేకపోయినా.. అధికారం కోల్పోయి ఇంట్లో కూర్చోవాల్సి వస్తోంది. అన్ని చోట్లా అదే జరిగింది. అందుకే.. చాలా మంది ప్రాంతీయ పార్టీల నేతలు ఆయన ప్రాపకం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. కేసీఆర్ కూడా.. నిన్నామొన్నటిదాకా అంతే. ఇప్పుడే ఆయన జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. బీజేపీ గురించి విమర్శులు చేస్తున్నారు. అప్పుడే ఆయన బీజేపీ తనను టార్గెట్ చేసిందని చెప్పుకోవడం ప్రారంభించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close