చంద్రబాబుపై ఏం చర్యలు తీసుకోబోతున్నారు..!?

తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబుపై అనర్హతా వేటు వేస్తారా..?. టీడీపీ సభ్యుల సస్పెన్షన్ తర్వాత అసెంబ్లీలో జరిగిన పరిణామాలు ఇదే విషయాన్ని సూచిస్తున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఆయనపై అనర్హతా వేటు వేయకపోయినా… రెండు, మూడేళ్ల పాటు సస్పెన్షన్ వేటు వేయడానికి అవకాశం ఉందన్న చర్చ కూడా జరుగుతోంది. దీనికి కారణం.. టీడీపీ సభ్యులందరూ సస్పెన్షన్ కారణంగా బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వతా అసెంబ్లీలో చంద్రబాబు ప్రవర్తనను ఖండిస్తూ తీర్మానం చేశారు. చంద్రబాబు వ్యవహారశైలిపై రూల్ 77 ప్రకారం చర్యలు తీసుకోవాలని మంత్రి బుగ్గన తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. దీన్ని పరిశీలనలోకి తీసుకుంటున్నామని స్పీకర్ తమ్మినేని ప్రకటించారు.

అలాగే సరైన సమయంలో చర్యలు తీసుకుంటామని కూడా చెప్పేశారు. సభలో దురదృష్టకరమైన పరిణామం ఎప్పుడూ చూడలేదని.. ప్రతిపక్ష నేత కన్‌ఫ్యూజన్‌లో పడ్డారని తమ్మినేని సీతారాం విమర్శించారు. రాజ్యాంగ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని హితవు పలికారు. తీర్మానం చేసినందున ఇప్పుడు స్పీకర్ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. గతంలో తెలంగాణ అసెంబ్లీలో గలాటా సృష్టించారని ఎమ్మెల్యేలుగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్‌ల శాసనసభ్యత్వాలను స్పీకర్ మధుసూదనాచారి రద్దు చేశారు.

ఇప్పుడు.. చంద్రబాబుపైనా అలాంటి చర్య తీసుకునే అవకాశాల్ని పరిశీలించవచ్చని అంటున్నారు. అయితే పోడియం ముందు ధర్నా చేస్తేనే అనర్హతా వేటు వేస్తారా.. లేక .. రెండు మూడేళ్లు సస్పెన్షన్ వేటు వేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత ప్రభుత్వం ఇతర విషయాల్ని పట్టించుకోవడం లేదు.. చేయాలనుకున్న చేస్తోంది కాబట్టి.. ఏ చర్య తీసుకున్న ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

మహాసేన రాజేష్‌కు మళ్లీ పవన్‌పై కోపం వచ్చింది !

మహాసేన రాజేష్ రాను రాను కూటమికి సమస్యగా మారుతున్నారు. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ విజయం రాష్ట్రానికి ప్రమాదకరం అంటూ ఓ వీడియో చేశారు. అంతగా ఆయనకు ఎందుకు పవన్ పై కోపం...

జాత‌రలో అల్ల‌రోడి ఫైటింగులు!

అల్ల‌రి న‌రేష్‌... ఈమ‌ధ్య ర‌క‌ర‌కాల జోన‌ర్లు ట‌చ్ చేస్తున్నాడు. సోష‌ల్ మెజేజ్ ఉన్న క‌థ‌ల్ని, త‌న‌దైన కామెడీ స్టోరీల్ని స‌మాంత‌రంగా చేసుకొంటూ వెళ్తున్నాడు. మ‌రోవైపు క్యారెక్ట‌ర్ పాత్ర‌ల‌కు న్యాయం చేస్తున్నాడు. ఇప్పుడు యాక్ష‌న్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close