ఛాన‌ళ్ల బండారం బ‌య‌ట‌పెట్టిన చిరంజీవి

ప్ర‌జారాజ్యం పార్టీ ఫెయిల్యూర్ కి చాలా కార‌ణాలున్నాయి. అప్ప‌ట్లో కొన్ని ఛాన‌ళ్లు.. చిరుకి వ్య‌తిరేకంగా ప‌నిచేశాయి. చిరంజీవి చేసిన చిన్న చిన్న విష‌యాల్ని సైతం భూత‌ద్దంలో పెట్టి చూపించాయి. ఓసారి.. అభిమానుల‌కు క‌ర‌చాల‌నం ఇచ్చిన వెంట‌నే, చిరు చేతికి శానిటైజ‌ర్ రాసుకోవ‌డం తో ఛాన‌ళ్లు… ఆ దృశ్యంపై బాగా ఫోక‌స్ చేశాయి. ‘అభిమానులు అంట‌రానివాళ్లా?’ ఇలాంటి వాళ్లు ప్ర‌జ‌ల‌కు సేవ ఏం చేస్తారు` అన్న‌ట్టు క‌థ‌నాలు ప్ర‌సారం చేశాయి. దాంతో చిరు ఫ్యాన్స్ కూడా త‌మ హీరోపై అనుమానం గా చూశారు.

ఈ క‌థ‌నం వెనుక అస‌లు నిజాన్ని ఇటీవ‌ల చిరు బ‌య‌ట పెట్టాడు. ఆరోజు తాను శానిటైజ‌ర్ వాడిన మాట వాస్త‌వ‌మే అని, అయితే… ప్ర‌జా సంక‌ల్ప యాత్ర లో భాగంగా, బ‌స్సులో ప్ర‌యాణిస్తున్న‌ప్పుడు, త‌న‌కెవ‌రో ఖ‌ర్జూరం అందించార‌ని, అది తినే ముందు… చేతుల్ని శానిటైజ‌ర్‌తో శుభ్రం చేశాన‌ని, అయితే… అదొక్క‌టీ ఎడిట్ చేసి, అభిమానికి షేక్ హ్యాండ్ ఇవ్వ‌డం, శానిటైజ‌ర్ వాడ‌డం, ఇవి మాత్ర‌మే ఫోక‌స్ చేశార‌ని, అభిమానులు అంట‌రాన్ని వాళ్లా? అంటూ పెద్ద పెద్ద హెడ్డింగులు పెట్టార‌ని, ఇది చ‌క్క‌టి ఎడిటింగ్ నైపుణ్యానికి నిద‌ర్శ‌న‌మ‌ని.. సెటైర్ వేశాడు. ఇదంతా.. సీరియ‌స్ గా, మీడియాపై కోపంతో చెప్ప‌లేదు. స‌ర‌దాగా.. గుర్తు చేసుకున్నారంతా. ఆ ఫుటేజీల‌న్నీ మీడియా హౌసుల్లో ఇంకా భ‌ద్రంగానే ఉన్నాయ‌ని, వాటిని బ‌య‌ట‌కు తీస్తే.. నిజానిజాలేమిట‌న్న‌ది ప్ర‌జ‌లే తీర్పు చెబుతార‌ని.. చిరు వ్యాఖ్యానించారు. మొత్తానికి ప్ర‌జారాజ్యం స‌మ‌యంలో త‌న‌పై ప‌డిన నింద‌ని చిరు ఈ రూపంలో చెరిపేసుకునే ప్ర‌య‌త్నం చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అప్పుడే ఓటమికి కారణాలు చెప్పేసిన మంత్రి..!?

సర్వేలన్నీ కూటమిదే అధికారమని తేల్చడం, పోలింగ్ శాతం పెరగడంతో వైసీపీ నేతలు అప్పుడే ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారు. కారణం ప్రభుత్వ వ్యతిరేకత కాదని, సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారని ఆరోపిస్తున్నారు. సాధారణ...

ఏపీలో ముగిసిన పోలింగ్ …పోలింగ్ పెరగడంతో వైసీపీలో టెన్షన్..?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. కొన్ని ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పలు జిల్లాలో వైసీపీ , టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు...

పోలింగ్ తగ్గించాలనే వైసీపీ “దాడుల ప్లాన్” పెయిల్ !

వీలైనంత వరకూ పోలింగ్ తగ్గించాలని వైసీపీ ముందుగానే ప్లాన్ చేసుకుంది. కీలకమైన నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభం కాక ముందే టీడీపీ ఏజెంట్లపై దాడులు చేసి వాటిని విస్తృతంగా ప్రచారం చేయాలనుకున్నారు. అనుకున్నట్లుగా...

ఆ చెంపదెబ్బ వైసీపీ ఎమ్మెల్యేకి కాదు వైసీపీకే !

ఏపీలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన వెంటనే అ పెద్ద అపశకునం వైసీపీకి వచ్చింది. అది కూడా తమ ఎమ్మెల్యేకు చెంపదెబ్బ రూపంలో. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చెంప...

HOT NEWS

css.php
[X] Close
[X] Close