ఏలూరు బాధితులకు ప్రభుత్వ సాయం లేదా..!?

ఏలూరులో వింత వ్యాధి బాధితులకు ప్రభుత్వం తరపున ఎలాంటి సాయం ప్రకటించకపోవడంపై అక్కడి ప్రజల్లో నిరసన వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇలా.. ఎవరైనా ఆకస్మాత్‌గా బాధితులుగా మారిన వారి పట్ల ఎంతో ఔదార్యం చూపుతూ ఉంటారు. ఎల్జీ ఘటనలో మృతులకు రూ. కోటి నష్టపరిహారం ప్రకటించడమే కాదు.. మనిషికిరూ. పదివేల చొప్పున పంపిణీ చేశారు. ఏలూరులో బాధితులు అంత మంది లేరు. ఒక్కరు చనిపోయారు. ఓ ముప్ఫై మంది పరిస్థితి మాత్రం ఆందోళన కరంగా ఉంది. వారిని విజయవాడ, గుంటూరు తరలించి చికిత్స అందిసత్తున్నారు. ఐదు వందలమందికిపైగా.. చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యారు. వీరికి ప్రభుత్వం సాయం ప్రకటిస్తుందని… ఏలూరు ప్రజలు ఆశించారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏలూరు పర్యటనకు వచ్చినప్పుడు.. బాధితులకు సాయం ప్రకటన చేస్తారని అందరూ ఆశించారు. అయితే.. ఆస్పత్రిలో రోగులను పరామర్శించి.. ధైర్యం చెప్పి వెళ్లారు.కానీ ఎలాంటి సాయమూ ప్రకటించలేదు. సమీక్ష చేసిన తర్వాత అయినా.. చేస్తారని అనుకున్నారు. కానీ.. ప్రభుత్వానికి ఏలూరు బాధితులకు సాయం చేసే ఆలోచన లేదన్న అభిప్రాయం ఇప్పుడు ఏర్పడుతోది. ఎలాంటి నష్టపరిహారం చెల్లించే యోచన ప్రభుత్వానికి లేదన్న సంకేతాలు వస్తున్నాయి. ఓ ప్రైవేటు కంపెనీ నిర్లక్ష్యం వల్ల చనిపోయిన వారికి.. రూ. కోటి నష్టపరిహారం ఇచ్చిన జగన్… ఏలూరు విషయంలో మరింత ఉదారంగా ఉంటారని అనుకున్నారు.

ఏలూరు వింత వ్యాధిపై బాధితులు వందల్లో ఉన్నారు. ఆ కుటుంబాలన్నీ మానసికంగా కూడా ఆందోళన చెందారు. అలాంటి వారికి ప్రభుత్వం.. తామున్నామన్న భరోసా ఇవ్వడానికైనా..ఎంతో కొంత సాయం ప్రకటించి ఉండాల్సిందన్న చర్చ జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి.. ఏపీలో ఎలాంటి ఘటన జరిగినా.. పెద్ద ఎత్తున సాయం చేస్తున్నారు. కానీ ఏలూరు విషయంలో మాత్రం అలాంటి సాయం చేయడానికి ఆయన ఎందుకో సిద్ధంగా లేరన్న అభిప్రాయం అక్కడిప్రజల్లో వ్యక్తమవుతోంది. కారణాలు తెలిసిన తర్వాతైనా జగన్ పరిహారం ఇస్తారని.. ఏలూరు బాధితులు ఆశగా ఉన్నారు. మరి చేస్తారో లేదో చూడాలి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అప్పుడే ఓటమికి కారణాలు చెప్పేసిన మంత్రి..!?

సర్వేలన్నీ కూటమిదే అధికారమని తేల్చడం, పోలింగ్ శాతం పెరగడంతో వైసీపీ నేతలు అప్పుడే ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారు. కారణం ప్రభుత్వ వ్యతిరేకత కాదని, సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారని ఆరోపిస్తున్నారు. సాధారణ...

ఏపీలో ముగిసిన పోలింగ్ …పోలింగ్ పెరగడంతో వైసీపీలో టెన్షన్..?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. కొన్ని ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పలు జిల్లాలో వైసీపీ , టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు...

పోలింగ్ తగ్గించాలనే వైసీపీ “దాడుల ప్లాన్” పెయిల్ !

వీలైనంత వరకూ పోలింగ్ తగ్గించాలని వైసీపీ ముందుగానే ప్లాన్ చేసుకుంది. కీలకమైన నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభం కాక ముందే టీడీపీ ఏజెంట్లపై దాడులు చేసి వాటిని విస్తృతంగా ప్రచారం చేయాలనుకున్నారు. అనుకున్నట్లుగా...

ఆ చెంపదెబ్బ వైసీపీ ఎమ్మెల్యేకి కాదు వైసీపీకే !

ఏపీలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన వెంటనే అ పెద్ద అపశకునం వైసీపీకి వచ్చింది. అది కూడా తమ ఎమ్మెల్యేకు చెంపదెబ్బ రూపంలో. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చెంప...

HOT NEWS

css.php
[X] Close
[X] Close