ముంచేసి సారీ చెప్తే సరిపోతుందా సీఎం సారు..!?

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారీ చెప్పారు. తెలియక తప్పు చేసి ఉంటే మీ బిడ్డగా మన్నించాలని కోరారు. ఆయన ఇంతగా పశ్చాత్తాప పడటానికి కారణం.. కడప జిల్లాలో కట్టిన గండికోట ప్రాజెక్ట్ ముంపు బాధితులకు పరిహారం ఇవ్వకుండా నీళ్లు నిల్వ చేయడం. అలా చేయడం వల్ల కొన్ని గ్రామాల్లో వందల మంది ప్రజలు నిలువ నీడ లేకుండా పోవడం. అలా పోయిన వారికి కనీస సాయం కూడా చేయకుండా.. తిరగబడిన వారిపై పోలీసు కేసులు పెట్టారు. అప్పుడు ఎలాంటి స్పందన వ్యక్తం చేయని ముఖ్యమంత్రి జగన్… ఇప్పుడు వారికి ఐయాం సారీ అని చెప్పి … సంతృప్తి పరిచే ప్రయత్నం చేశారు.

కడప జిల్లా వైఎస్ ఫ్యామిలీ పట్టులోనే ఉన్నప్పటికీ.. గండికోట నిర్వాసితులకు పునరావాస కాలనీల నిర్మాణం దశాబ్దాలుగా సాగుతూనే ఉంది. గండికోటలో ఏటేటా పెరుగుతున్న నీటి నిల్వల తాకిడికి నిర్వాసిత గ్రామాలు ఒక్కొక్కటిగా ముంపుబారిన పడుతున్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే గండికోట నిర్వాసితులకు రూ.10 లక్షల వరకు చెల్లింపులు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. తర్వాత పట్టించుకోలేదు. ఇటీవల నీళ్లు నింపడం ప్రారంభించడంతో తాళ్లపొద్దుటూరు లాంటి గ్రామాలు నీట మునిగాయి. గండికోట నిర్వాసితులందరికీ ఇళ్లస్థలాలు చూపించకుండా నీళ్లను నిల్వ చేయడం దుర్మార్గమని అక్కడి ప్రజలు కన్నీరు పెట్టుకున్నా పాలకులు కరుణించలేదు.

85 శాతం మందికి పైగా పరిహారం చెల్లింపులు చేశామని అధికారులు ప్రకటించారు. సాంకేతికత అవరోధాల కారణంగా కొంత మందికి పరిహారం పెండింగ్‌లో పడిందని చెబుతున్నారు. కానీ.. అనేక చోట్ల అనర్హుల్ని పరిహారం ఇచ్చే జాబితాలో చేర్చి.. డబ్బులు కాజేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఇలా ఓ వ్యక్తి ప్రశ్నించినందుకు ఓ హత్య కూడా జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో… నీరు చేరుతూనే ఉంది. వారికి ఎలాంటి సాయం చేయకుండా.. ముఖ్యమంత్రి సారీ చెప్పి సరి పెట్టారనే అసంతృప్తి మాత్రం అక్కడి ప్రజల్లో కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో కల్లోల పరిస్థితి…అందుకే జగన్ కాముష్..?

ఓడిపోతున్నట్లు నిర్ధారణకు వచ్చారో లేదంటే, తన్నుకొని చావండి అనుకున్నారో ఏమో కాని, ఏపీలో చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. పల్నాడులో టీడీపీ - వైసీపీ...
video

టీజర్ రివ్యూ : ఇస్మార్ట్ డబుల్ మాస్

https://youtu.be/tq2HmozH_5Y?si=7YJ-IcGKWvYsaRDj రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్‌ సీక్వెల్ 'డబుల్ ఇస్మార్ట్'తో అలరించబోతున్నారు. రామ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ విడుదల చేశారు. ల్యాబ్‌లో ఉన్న...

ఏపీలో ఉద్రిక్తత… రంగంలోకి కేంద్ర బలగాలు..!!

ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత కూడా పలు జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తుతుండటంతో ఈసీ సీరియస్ అయింది. పల్నాడు జిల్లాలో 144సెక్షన్ విధించాలని జిల్లా...

యాక్షన్ లోకి దిగిన హీరోయిన్స్

గ్లామర్ పాత్రలతో ప్రేక్షకులని ఫిదా చేసే హీరోయిన్స్ యాక్షన్ బరిలో దిగుతున్నారు. హీరోలకు ధీటుగా పోరాటాలు చేస్తూ యాక్షన్ చిత్రాలతో సై అంటున్నారు. ఒకరు తుపాకీ పట్టుకొని బుల్లెట్ల వర్షం కురిపిస్తే.. మరొకరు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close