అడ‌వి శేష్‌కి మోకాళ్ల‌డ్డుతున్న ‘టూ స్టేట్స్‌’

బాలీవుడ్ లో సూప‌ర్ హిట్ట‌యిన `టూ స్టేట్స్‌`ని తెలుగులో రీమేక్ చేసి, ఆ సినిమాని మ‌ధ్య‌లో ఆపేసిన సంగ‌తి తెలిసిందే. అడ‌విశేష్ క‌థానాయ‌కుడిగా ఈ సినిమాని మొద‌లెట్టారు. రాజ‌శేఖ‌ర్ కుమార్తె శివాని క‌థానాయిక‌. అనివార్య కార‌ణాల వ‌ల్ల ఈ సినిమా ఆగిపోయింది. అప్ప‌టికి దాదాపు 90 శాతం షూటింగ్ కూడా అయిపోయింది. ఈ సినిమాని ఎలాగైనా స‌రే, పూర్తి చేసి విడుద‌ల చేయాల‌న్న‌ది నిర్మాత ఎం.ఎల్‌.వి స‌త్య‌నారాయ‌ణ ప్లాన్‌.

అడ‌విశేష్ మ‌రో 20 రోజులు కాల్షీట్లు ఇస్తే.. ఈ సినిమా అయిపోతుంది. అయితే శేష్ మాత్రం ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ ప‌రిస్థితుల్లో `టూ స్టేట్స్‌` కాల్సీట్లు ఇవ్వ‌డం క‌ష్ట‌మే. శేష్‌కి కూడా ఈ రీమేక్ పై న‌మ్మ‌కం లేదు. `సినిమాని ఆపేద్దాం. నా పారితోషికం తిరిగి ఇచ్చేస్తా. కావాలంటే మ‌రో సినిమా చేస్తా` అని నిర్మాత‌కు మాట ఇచ్చాడ‌ని తెలుస్తోంది. కానీ… ఇప్ప‌టి వ‌ర‌కూ పారితోషికం వెన‌క్కి ఇవ్వ‌లేదు. మ‌రో సినిమా ఒప్పుకోలేదు. `టూ స్టేట్స్‌` ప‌క్క‌న పెట్టి, మిగిలిన సినిమాలు ఒకే చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ విష‌య‌మై నిర్మాత‌… అడ‌విశేష్‌పై కోర్టుకెక్కిన‌ట్టు తెలుస్తోంది. కోర్టు కూడా `ముందు టూ స్టేట్స్ విష‌యాన్ని సెటిల్ చేసుకోండి` అని అడ‌విశేష్ త‌ర‌పున న్యాయ వాదికి సూచించార్ట‌. శేష్ మ‌రో సినిమా ఒప్పుకోవాల‌న్నా, విడుద‌ల అవ్వాల‌న్నా.. `టూ స్టేట్స్` నిర్మాత నుంచి నో అబ్జెక్ష‌న్ స‌ర్టిఫికెట్ తీసుకోవాలి. మ‌రి.. ఈ విష‌యాన్ని శేష్ ఎప్పుడు సెటిల్ చేసుకుంటాడో, ఏమో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close