సుచరితను టార్గెట్ చేసిన సోము వీర్రాజు..!

ఆలయాలపై దాడులు జరుగుతూంటే… భారతీయ జనతా పార్టీ వైసీపీ ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా స్పందించడం ఆసక్తికరంగా మారింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇప్పటి వరకూ ఆలయాలపై దాడులు వంటి వాటిపై స్పందించారు కానీ ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధం కాలేదు. అది ఆయన తరహా రాజకీయం కాదు. కానీ ఏపీలో వరుసగా జరుగుతున్న దాడులు.. పోలీసులు ఎక్కడా నిందితుల్ని పట్టుకోలేకపోవడం వంటి కారణాల వల్ల ఆయన ఆలసత్వం వహించి నిర్లక్ష్యం చేస్తే ఇంకా పెరిగిపోతాయన్న భావనతో… స్వయంగా రంగంలోకి దిగారు. విజయనగరం రామతీర్థం ఆలయాన్ని పరిశీలించబోతున్నారు.

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆలయాలపై దాడులు జరుగుతున్నప్పటికీ.. ఇప్పటి వరకూ..కేసులు పెట్టింది లేదు. పిచ్చివాళ్లు చేశారని లెక్కలేశారు. అంతర్వేది రథం దగ్ధం… విజయవాడలో మూడు సింహాల మాయం వంటి ఘటనల్లో ఎన్ని విచారణలు వేసినా నిందితులు తేలలేదు. ఇంత పెద్ద విషయాలపై బీజేపీ కూడా మౌనం పాటిస్తోంది. ఈ కారణంగా ప్రభుత్వ పెద్దలకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందోనన్నట్లుగా ప్రకటనలు చేస్తోంది. చంద్రబాబు విజయనగర పర్యటన ఖరారైన తరవాత.. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. ట్విట్టర్ ద్వారాఓ ప్రకటన చేశారు. దాని సారాంశం… హోంమంత్రి సుచరిత.. బాధ్యత తీసుకోవాలి. దాడులు జరుగుతున్నా… ఆమె పట్టించుకోవడం లేదని సోము వీర్రాజు ఆరోపణ.

సోము వీర్రాజు ప్రకటన.. డిమాండ్ చూసి.. వైసీపీ వర్గాలు కూడా ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నాయి. హోంమంత్రిగా ఉన్న సుచరిత కనీసం రోజువారీ విధులు కూడా నిర్వహించడం లేదని… దిశ చట్టంద్వారా ముగ్గురికి ఉరి శిక్ష వేశామని ప్రకటించినప్పుడే తేలిపోయిందంటున్నారు. ముఖ్య సలహాదారు మొత్తం హోంమంత్రి, డీజీపీ అధికారాల్ని గుప్పిట పట్టి బండి నడిపిస్తున్నారని అంటున్నారు. ఆయనే ఈ విమర్శలపై ప్రెస్‌మీట్ పెట్టి సమాధానం కూడా ఇచ్చారు. కానీ సోము వీర్రాజు మాత్రం.. సుచరితను టార్గెట్ చేస్తున్నారు. వీర్రాజు సీఎం జగన్‌కి ఏ ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా మాట్లాడుతున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య ట్విట్టర్లో సెటైర్లు వేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘మిరాయ్’ నుంచి మ‌రో స‌ర్‌ప్రైజ్‌

'హ‌నుమాన్‌' త‌ర‌వాత తేజా స‌జ్జా నుంచి వ‌స్తున్న సినిమా 'మిరాయ్‌'. కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని ద‌ర్శ‌క‌త్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవ‌లే టీజ‌ర్ విడుద‌ల చేశారు. టీజ‌ర్‌లోని షాట్స్,...

ఓటమి భయం… ఏపీలో వైసీపీ మళ్లీ ఫ్యాక్షన్ పాలిటిక్స్..!?

ఏపీలో మరో మూడు రోజుల్లో ప్రచారం ముగియనున్న నేపథ్యంలో వైసీపీ ఏమైనా ప్లాన్ చేస్తుందా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ అనుకూలురుగా ముద్రపడిన అధికారులను ఈసీ మార్చేస్తుండటంతో జగన్ రెడ్డి దిక్కితోచని...

తీన్మార్ మల్లన్న స్టైలే వేరు !

వరంగల్-ఖమ్మ-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన ఆ స్థానంలో వస్తున్న ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి తీరాలని తీన్మార్ మల్లన్న గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు....

వంద కోట్ల వెబ్ సిరీస్ ఏమైంది రాజ‌మౌళీ?!

బాహుబ‌లి ఇప్పుడు యానిమేష‌న్ రూపంలో వ‌చ్చింది. డిస్నీ హాట్ స్టార్ లో ఈనెల 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అయితే 'బాహుబ‌లి' సినిమాకీ ఈ క‌థ‌కూ ఎలాంటి సంబంధం ఉండ‌దు. ఆ పాత్ర‌ల‌తో,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close