సీక్వెల్స్ కి ‘సై’ అన్న ర‌వితేజ‌!

సీక్వెల్ ఓ విజ‌య సూత్రం. విజ‌య‌వంత‌మైన సినిమాని కొన‌సాగించ‌డం మామూలు విష‌యం కాదు. అంచ‌నాలు భారీగా ఉంటాయి. వాటిని అందుకున్న సినిమాలూ త‌క్కువే. కాక‌పోతే… సీక్వెల్ అన‌గానే మార్కెట్ మొద‌లైపోతుంది. ఆ కాంబినేష‌న్ పై ఉన్న అంచ‌నాల‌తో.. బిజినెస్ భారీగా జ‌రుగుతుంది. అది.. క‌చ్చితంగా ప్ల‌స్ పాయింటే. కాబ‌ట్టే సీక్వెల్స్ ప‌ల్టీ కొడుతున్నా – వ‌స్తూనే ఉంటాయి.

ర‌వితేజ `కిక్‌` కి సీక్వెల్‌గా `కిక్ 2` వ‌చ్చింది. ఆసినిమా డిజాస్ట‌ర్ గా నిలిచింది. అయినా స‌రే.. సీక్వెల్స్‌కి సై అంటున్నాడు మాస్ మ‌హారాజా. ఇటీవ‌ల విడుద‌లైన `క్రాక్‌`కి సీక్వెల్ వ‌స్తుంద‌ని.. ఆ సినిమా చివ‌ర్లో సూచ‌న ప్రాయంగా చెప్పేసింది చిత్ర‌బృందం. ఈ సినిమా సీక్వెల్ చేయ‌డానికి ర‌వితేజ కూడా రెడీగానే ఉన్నాడు. క్రాక్ జ‌రుగుతున్న‌ప్పుడే సీక్వెల్ చేద్దాం.. అని గోపీచంద్ మ‌లినేనికి చెప్పాడ‌ట ర‌వితేజ‌. అందుకే…. ఆ ధైర్యంతోనే క్లైమాక్స్ లో `క్రాక్ 2` వ‌స్తోంద‌ని చెప్ప‌గ‌లిగాడు. ర‌వితేజ దృష్టి మ‌రో సినిమాపై కూడా ఉంది. అదే… `రాజా ది గ్రేట్`. అనిల్ రావిపూడి న‌టించిన ఈసినిమా మంచి విజ‌యాన్ని అందుకుంది. ఈ సినిమా సీక్వెల్ కి త‌గిన క‌థ అనిల్ రావిపూడి ద‌గ్గ‌ర రెడీగా ఉంది. “రాజా ది గ్రేట్ సీక్వెల్ చేద్దామ‌ని అనిల్ నాతో చెప్పాడు. ఓ లైన్ కూడా వినిపించాడు. అది చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది“ అని చెప్పుకొచ్చాడు ర‌వితేజ‌. సో… ర‌వితేజ నుంచి ఈ రెండు సీక్వెల్స్ రావ‌డం ఖాయ‌మ‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో సంయుక్త‌

బెల్లంకొండ శ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడిగా మూన్ షైన్ పిక్చ‌ర్స్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. దీంతో లుధీర్ బైరెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా సంయుక్త మీన‌న్ ని ఎంచుకొన్నారు. బెల్లంకొండ -...

మ‌హేష్‌, ఎన్టీఆర్ చిత్రాల‌పై క్లారిటీ!

ఈ యేడాది టాలీవుడ్ లో భారీ, క్రేజీ చిత్రాలు ప్రారంభం కాబోతున్నాయి. వాటిలో మ‌హేష్ - రాజ‌మౌళి, ఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ చిత్రాలు ముందు వ‌రుస‌లో ఉన్నాయి. 'గుంటూరు కారం' పూర్త‌యిన...

కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని ఫోటో మాయం..కారణం అదేనా..?

ఆస్ట్రాజెనికా తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ తో దుష్ప్రభావాలు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించిన రెండు రోజుల వ్యవధిలోనే కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో అదృశ్యమవ్వడం చర్చనీయాంశం అవుతోంది....

రేవంత్ కు నోటీసులు అంతా తూచ్..!!

కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసు విషయంలో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ఈ కేసు విషయంలో ఢిల్లీ పోలిసుల నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులే అందలేదు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close