టీఆర్ఎస్‌పై బండి సంజయ్ మైండ్ గేమ్..!

రాజకీయాల్లో ఊహాగానాలు, పుకార్లు …కీలక పరిణామాలకు కారణం అవుతాయి. సొంత పార్టీ నేతలపై .. అగ్ర నేతల్లో అపనమ్మకం పెంచడమే వీటి లక్ష్యం. ఇలాంటివి సక్సెస్ అయితే… నమ్మకస్తుల్ని ఆయా పార్టీల నేతలు కోల్పోతారు. వారంతా… ప్రత్యర్థి పార్టీలో చేరిపోతారు. ఇలాంటి వ్యూహాన్ని ఇప్పుడు.. బండి సంజయ్ చాలా దూకుడుగా టీఆర్‌ఎస్ పై ప్రయోగిస్తున్నారు. టీఆర్ఎస్ నేతలు..తమతో టచ్‌లోఉన్నారని చెప్పడమే కాదు… తమ పార్టీలో చేరడానికి ఇష్టం లేని వాళ్లు సొంత పార్టీలు పెట్టుకోవడానికి సిద్ధమవుతున్నారన్న ప్రకటనలు చేస్తున్నారు. బండి సంజయ్ ప్రకటనలు సహజంగానే చర్చనీయాంశం అవుతున్నాయి. బీజేపీతో టచ్‌లో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు..? పార్టీ పెట్టడానికిసిద్ధమవుతున్న ఎమ్మెల్యేలు ఎవరు..? అంటూ టీఆర్ఎస్‌లోనే చర్చ జరిగేలా చేస్తున్నారు.

ప్రస్తుతం బండి సంజయ్.. ఖమ్మం, వరంగల్ మధ్య చక్కర్లు కొడుతున్నారు. అక్కడ కార్పొరేషన్ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. దీంతో ఆయా ప్రాంతాలకు వెళ్లి.. టీఆర్ఎస్ అంతర్గత రాజకీయాల గురించిమాట్లాడుతున్నారు. కేటీఆర్‌ను సీఎం చేయడం కేసీఆర్‌కు ఇష్టం లేదని కూడా బండి సంజయ్ చెప్పుకొచ్చారు. పార్టీలో చీలికలు వస్తాయని కేటీఆర్‌కు చెబుతున్నారని ఆయన అంటున్నారు. అలాగే మంత్రి పదవులు రాకపోతే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సొంత పార్టీ పెట్టే యోచనలో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా మంది అసంతృప్తితో ఉన్నారని.. వచ్చే ఎన్నికల నాటికి గంపగుత్తగా టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి దూకుతారని ప్రకటిస్తున్నారు.

టీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరకుండా.. ఆ పార్టీ అధినేత ప్లాన్ చేసుకుంటున్నారు. అందర్నీ బుజ్జగిస్తున్నారు. పార్టీకి అవసరం లేకపోయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో బయటకు వెళ్లకుండా… చూసుకుంటున్నారు. అధికార పార్టీగా.. ఆ అడ్వాంటేజ్.. టీఆర్ఎస్‌కు ఉంది. అయితే.. ఎంత ఎక్కువగా టీఆర్ఎస్ లో అసంతృప్తి ఉందనే ప్రచారం చేస్తే అంత మంచిదని బీజేపీ భావిస్తోంది. ఆ దిశగా… మైండ్ గేమ్ ను బండి సంజయ్ దూకుడుగానే నిర్వహిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close