గోపూజలో సీఎం జగన్..!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని విపక్షాలు మత పరంగా ఎన్ని విమర్శలు చేస్తున్నప్పటికీ.. తన పని తాను చేసుకుపోతున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సారి సంక్రాంతికి గోపూజలో పాల్గొంటున్నారు. నరసరావుపేట మున్సిపల్‌ స్టేడియంలో జరిగే గోపూజ మహోత్సవంలో ముఖ్యమంత్రి పాల్గొనాలని నిర్ణయించారు. టీటీడీ, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా గోపూజ కార్యక్రమం జరుగుతోంది. మొత్తం 2,679 ఆలయాల్లో గోపూజ జరుగుతోంది. అందులో భాగంగా నర్సరావుపేటలో భారీగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమంలో సీఎం పాల్గొని గోవులకు పూజ చేయనున్నారు.

కనుమ పండుగను పశువుల పండుగగా భావిస్తారు. తమ యజమానులకు సహాయకంగా ఉండే ముగజీవాలని ఆరాధించే రోజు కనుమ పండుగ. సంప్రదాయంగా ఇంట్లోని పశువుల్ని ఈ పండుగ సందర్భంగా పూజిస్తారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కూడా.. పశువులను పూజించే కార్యక్రమాంలో పాల్గొనాలని భావించారు. వెంటనే.. సీఎంవో అధికారులు నర్సరావుపేటలో కార్యక్రమాన్ని ఖరారు చేశారు. హిందూ సంప్రదాయం ప్రకారం.. ముఖ్యమంత్రి జగన్.. పశువుల్ని పూజించనున్నారు.

ఇటీవలి కాలంలో ఏపీలో జరుగుతున్న రాజకీయ మార్పుల కారణంగా… మత ప్రస్తావన ఎక్కువగా వస్తోంది. దీనికి చెక్ పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా హిందూ ధార్మిక కార్యకలాపాల్లో పాల్గొంటూ… అన్ని మతాలూ తనకు సమానమేనని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. గత ప్రభుత్వం అభివృద్ధి కార్యకలాపాల పేరుతో కూల్చివేసిన గుళ్లు నిర్మిస్తామని.. ప్రకటించడమే కాకుండా.., సంప్రదాయబద్ధంగా శంకుస్థాపన కూడా చేశారు. ఇప్పుడు గోపూజలో పాల్గొంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జ‌గ‌న్ బ్యాండేజీ.. మ‌ళ్లీ ట్రోల్స్ షురూ!

అదేదో యాడ్‌లో చెప్పిన‌ట్టు.. 'ఏపీలో ఏం న‌డుస్తోంది' అంటే 'బ్యాండేజీల ట్రెండ్ న‌డుస్తోంది' అంటారు అక్క‌డి జ‌నం. ప్ర‌చార స‌భ‌లో జ‌గ‌న్‌పైకి ఎవ‌రో ఓ అగంత‌కుడు గుల‌క‌రాయి విసిరిన ద‌గ్గ‌ర్నుంచీ ఈ బ్యాండేజీ...

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

ఐపీఎల్ ఎఫెక్ట్: బౌల‌ర్లే బ‌లి ప‌శువులు అవుతున్నారా?!

262 ప‌రుగుల ల‌క్ష్యం.. ఒక‌ప్పుడు వ‌న్డేల్లో ఈ టార్గెట్ రీచ్ అవ్వ‌డానికి ఛేజింగ్ టీమ్ ఆప‌సోపాలు ప‌డేది. ఇప్పుడు టీ 20ల్లోనే ఊదిప‌డేశారు. శుక్ర‌వారం కొల‌కొత్తా నైట్ రైడ‌ర్స్‌ - కింగ్స్ లెవెన్ పంజాబ్...

ఫ్లాష్ బ్యాక్‌: క్రెడిట్ తీసుకోవడానికి భయపడ్డ త్రివిక్రమ్

ఇప్పుడు పరిస్థితి మారింది కానీ ఒకప్పుడు రచయిత అనే ముద్ర పడిన తర్వాత ఇక దర్శకుడయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. రైటర్ గానే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే అప్పట్లో దర్శకుడు కావాలని వచ్చిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close