ప‌వ‌న్ చుట్టూ తిరుగుతున్న మ‌రో ద‌ర్శ‌కుడు

ఈమ‌ధ్య ప‌వ‌న్ క‌ల్యాణ్ ధ్యాసంతా సినిమాల‌పైనే వుంది. కొత్త క‌థ‌ల్ని ఒప్పుకోవ‌డం, ద‌ర్శ‌కుల‌కు మాటివ్వ‌డం, అడ్వాన్సులు తీసుకోవ‌డం – ఇలా… సినిమాల‌పై ఫోక‌స్ పెరిగిపోయింది. ద‌ర్శ‌కులు త‌ర‌చూ ప‌వ‌న్‌ని క‌లుస్తూనే ఉన్నారు. క్రిష్ సినిమా సెట్లో సైతం… ద‌ర్శ‌క నిర్మాత‌ల హ‌వా ఎక్కువైంది. ప‌వ‌న్ అప్పాయింట్‌మెంట్ కోసం కొంత‌మంది ప‌డిగాపులు కాస్తున్నారు. ఈజాబితాలో వంశీ పైడిప‌ల్లి కూడా చేరిన‌ట్టు స‌మాచారం.

ప‌వ‌న్ – క్రిష్ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో జ‌రుగుతోంది. ఈ సంద‌ర్భంగా ప‌లుమార్లు ప‌వ‌న్ ని క‌లిశాడ‌ట వంశీపైడిప‌ల్లి. `మ‌హ‌ర్షి` త‌ర‌వాత‌.. వంశీ పైడిప‌ల్లి సినిమా ఎవ‌రితో అన్న‌ది ఇంకా ఖ‌రారు కాలేదు. కొంత‌మంది నిర్మాత‌ల‌తో కమిట్‌మెంట్స్ ఉన్నాయి గానీ, హీరో మాత్రం దొర‌క‌డం లేదు. ప‌వ‌న్ అయితే ఇప్పుడు ఫుల్ బిజీ. త‌న‌కున్న బిజీ షెడ్యూల్ లో కొత్త క‌థ‌లు వినేంత స్కోప్ లేదు. అయినా స‌రే.. వంశీ ప‌వ‌న్ చుట్టూ వైఫైలా తిరుగుతున్నాడ‌ని టాక్. ప‌వ‌న్ మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్ప‌లేం. ఓకే అన్నా అనేస్తాడు. అనేసినా.. వంశీ క‌నీసం రెండేళ్ల‌యినా ఆగాలి. ప‌వ‌న్ త‌న‌తో ఇప్ప‌టికిప్పుడు సినిమా చేయ‌క‌పోయినా.. క‌నీసం మాటిస్తే – భ‌విష్య‌త్తులో సినిమా సెట్ చేసుకోవొచ్చ‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టున్నాడు వంశీ. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close