పోలీసులకు వైసీపీ ఎమ్మెల్యే తిట్లు వినిపించలేదా ? : జేసీ

ఎస్పీని తిట్టినా.. హెచ్చరించినా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై చిన్న కేసు పెట్టకపోవడం… చివరికి చిన్న చిన్న విషయపై పెద్ద పెద్ద లేఖలు రాసే పోలీసు అధికారుల సంఘం కూడా స్పందించకపోవడంతో… ఇలాంటి కేసుల బారిన పడిన వారిలో కోపం తన్నుకు వస్తోంది. పోలీసులు మరీ వెన్నుముక లేకుండా అయిపోయారని అంటూ.. జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. జేసీ ప్రభాకర్ రెడ్డి కోపానికి కారణం… ఆయనపై పోలీసులే స్వయంగా ఫిర్యాదు చేసి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించారు. కొన్నాళ్ల కిందట.. ఆయన కడప జిల్లా జైలు నుంచి బెయిల్ పై విడుదలయ్యారు. ఆ సమయంలో అభిమానులు ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీ సమయంలో పోలీసులతో వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా విధుల్లో ఉన్న పోలీసు అధికారి ఒకరి అట్రాసిటీ కేసు పెట్టారు. అప్పుడు పోలీసు అధికారుల సంఘం కూడా స్పందించింది.

కానీ ఇప్పుడు.. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అంత దారుణంగా తిట్టినా.. పోలీసులెవరూ అవమానంగా ఫీలవలేదు. పోలీస్ అసోసియేషన్ స్పందించలేదు. అందుకే జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి పోలీసులపై విరుచుకుపడ్డారు. పోలీసులు.. ఐపీఎస్‌లు మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్లుగా వింటున్నారని.. ఆయనెవరని ప్రశఅనించారు. సాక్షి పత్రికలో కథలు రాసుకునే సజ్జల చెప్పినట్లుగా ఐఏఎస్ అధికారులు పని చేస్తున్నారని … కథలు రాసేవాడు… పోలీసులను ఆదేశిస్తే మీరెందుకు .. ఎందుకు కష్టపడి చదివి శిక్షణ తీసుకున్నారు.. అని ప్రశ్నించారు. మీ పరిస్థితి దారుణంగా ఉంది మారాలని సలహా ఇచ్చారు.

ఎస్పీపై చిందులేని నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఎవరో కాదు..జేసీ ప్రభాకర్ రెడ్డి బావమరిది. ఆయన భార్య సోదరుడే. ఈ విషయం కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు. నాకో న్యాయం…తన నా బావమరిదికో న్యాయం ఏమిటని మండిపడ్డారు. తేడా ఒక్కటే ఉందని అది రాజకీయ పార్టీ జెండాల్లో ఉందన్నారు. ఇంకెంత కాలం సజ్జల చేతుల్లో ఉంటారని.. బయటకు వచ్చి స్వతంత్రంగా పని చేయాలని జేసీ ప్రభాకర్ రెడ్డి సలహా ఇస్తున్నారు. అయితే.. పోలీసులు ఇలాంటివి పట్టించుకోడం మానేసి చాలా కాలం అయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close