ఎస్సీలపై అట్రాసిటీ కేసుల్ని కొట్టేస్తున్న హైకోర్టు..!

అట్రాసిటీ కేసుల్ని రాజకీయంగా వాడుకోవడానికి పూర్తి స్థాయిలో అలవాటు పడిపోయిన ఆంధ్రప్రదేశ్ పోలీసులకు హైకోర్టులో వరుస దెబ్బలు తగులుతున్నాయి. అట్రాసిటీ కేసులు చెల్లవని హైకోర్టు వరుసగా రెండో రోజు తీర్పు ఇచ్చింది. కొద్ది రోజుల కిందట.. రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులపై అట్రాసిటీకేసులు పెట్టారు. అలా కేసులు పెట్టిన వారిలో ఎస్సీ రైతులు కూడా ఉన్నారు. వారు చేసిన తప్పేమిటంటే… మూడు రాజధానులకు మద్దతుగా ఇతర ప్రాంతాల నుంచి మనుషుల్ని కూలీకి తీసుకువస్తున్న వారిని ఆపి.. ఎక్కడి నుంచి వస్తున్నారని అడగటం. ఆ పెయిడ్ కూలీల గురించి.. సోషల్ మీడియాలో వైరల్ అవడంతో.. పోలీసులు ఓ వ్యక్తి దగ్గర ఫిర్యాదు తీసుకుని ఆ రైతులపై అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. తర్వతా వారి చేతులకు బేడీలు వేసిన ఘటన కూడా కలకలం రేపింది.

అప్పుడే.. ఎస్సీ రైతులపై అట్రాసిటీ కేసులు పెట్టడం ఏమిటని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడా సెక్షన్లను ఎత్తి వేస్తూ.. హైకోర్టు తీర్పు చెప్పింది. మంగళవారం కూడా.. అట్రాసిటీ కేసుల విషయంలో హైకోర్టు ఇలాంటి తీర్పు చెప్పింది. పులివెందులలో ఓ దళిత మహిళ అత్యాచారం, హత్యకు గురయిందని టీడీపీ నేతలు ఆరోపిస్తూ.. చలో పులివెందుల నిర్వహించారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారందరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. ఇందులో టీడీపీ ఎస్సీ నేత వంగలపూడి అనితపైనా కేసు పెట్టారు. దీంతో ఆమె కోర్టులో పిటిషన్ వేసింది.

ఆమె సర్టిఫికెట్లను పరిశీలించి కేసు ఎత్తివేయాలని హైకోర్టు ఆదేశించింది. మిగిలిన వారిపై నాలుగు వారాల పాటు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. ఏపీలో కొత్త సర్కార్ ఏర్పడిన తర్వాత రాజకీయ నేతలపై అట్రాసిటీ కేసులు పెట్టడం కామన్ అయిపోయింది. రాజకీయ నేతల్ని బెదిరించాలంటే… అట్రాసిటీ కేసులే ఆయుధంగా మారాయి. దీనిపై తీవ్రమైన విమర్శలు వచ్చినప్పటికీ తగ్గలేదు. చివరికి ఎస్సీలపైనా అట్రాసిటీ కేసులు పెట్టే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు హైకోర్టు ఆ కేసుల్ని కొట్టి వేస్తున్నా.. ఇప్పటికి వారు టార్చర్ అనుభవించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close