చలో గిద్దలూరు..! రివెంజ్‌కు సిద్ధమవుతున్న పవన్ కల్యాణ్..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ అరాచకాలపై ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. గిద్దలూరు ఎమ్మెల్యే తిట్లు.. ఆ తర్వాత వైసీపీ కార్యకర్తల వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న జనసేన కార్యకర్త బండ్ల వెంగయ్యనాయుడుని పరామర్శించడానికి నేరుగా పవన్ కల్యాణ్ వెళ్తున్నారు. ఇప్పటికే వెంగయ్య కుటుంబానికి పవన్ కల్యాణ్ అండగా ఉంటామని ప్రకటించారు. రూ. ఐదు లక్షల ఆర్థిక సాయం కూడా అందచేయనున్నారు. శుక్రవారం పవన్ కల్యాణ్ ఒంగోలు వెళ్తారు. శనివారం రోజు.. వెంగయ్యనాయుడు కుటుంబాన్ని పరామర్శిస్తారు. సాయం అందచేస్తారు.

ఆ సమంయలోనే వైసీపీ ఎమ్మెల్యేల అరాచకాలపై యుద్ధం ప్రకటించే అవకాశం ఉంది. వెంగయ్యనాయుడు ఆత్మహత్య విషయంలో పవన్ కల్యాణ్ ఇప్పటికే.. ఎమ్మెల్యే అన్నా రాంబాబుతో పాటు… వెంగయ్యను బెదిరించిన వైసీపీ కార్యకర్తలపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. అయితే పోలీసులు గ్రామంలో కొంత మందిపై తూ..తూ మంత్రంగా కేసులు పెట్టారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్.. ఎమ్మెల్యేపై కేసులు పెట్టే వరకూ అక్కడే ఉంటానని.. ప్రకటించి పోరాటం ప్రారంభించే అవకాశం ఉందన్న చర్చ జనసేన వర్గాల్లో జరుగుతోంది.

ఎదురు తిరిగి పోరాడకపోతే.. వైసీపీ నేతలు.. కార్యకర్తలు వేధిస్తూనే ఉంటారని.. వారికి అధికారులు సహకరిస్తూనే ఉంటారని.. భావిస్తున్నారు. తిరగబడి సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని జనసేన వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇరవై మూడో తేదీ న గిద్దలూరులో పవన్ కల్యాణ్ విశ్వరూపం చూస్తారని జనసేన వర్గాలు చెబుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close