పోలీసులకు వైసీపీ ఎమ్మెల్యే తిట్లు వినిపించలేదా ? : జేసీ

ఎస్పీని తిట్టినా.. హెచ్చరించినా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై చిన్న కేసు పెట్టకపోవడం… చివరికి చిన్న చిన్న విషయపై పెద్ద పెద్ద లేఖలు రాసే పోలీసు అధికారుల సంఘం కూడా స్పందించకపోవడంతో… ఇలాంటి కేసుల బారిన పడిన వారిలో కోపం తన్నుకు వస్తోంది. పోలీసులు మరీ వెన్నుముక లేకుండా అయిపోయారని అంటూ.. జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. జేసీ ప్రభాకర్ రెడ్డి కోపానికి కారణం… ఆయనపై పోలీసులే స్వయంగా ఫిర్యాదు చేసి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించారు. కొన్నాళ్ల కిందట.. ఆయన కడప జిల్లా జైలు నుంచి బెయిల్ పై విడుదలయ్యారు. ఆ సమయంలో అభిమానులు ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీ సమయంలో పోలీసులతో వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా విధుల్లో ఉన్న పోలీసు అధికారి ఒకరి అట్రాసిటీ కేసు పెట్టారు. అప్పుడు పోలీసు అధికారుల సంఘం కూడా స్పందించింది.

కానీ ఇప్పుడు.. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అంత దారుణంగా తిట్టినా.. పోలీసులెవరూ అవమానంగా ఫీలవలేదు. పోలీస్ అసోసియేషన్ స్పందించలేదు. అందుకే జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి పోలీసులపై విరుచుకుపడ్డారు. పోలీసులు.. ఐపీఎస్‌లు మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్లుగా వింటున్నారని.. ఆయనెవరని ప్రశఅనించారు. సాక్షి పత్రికలో కథలు రాసుకునే సజ్జల చెప్పినట్లుగా ఐఏఎస్ అధికారులు పని చేస్తున్నారని … కథలు రాసేవాడు… పోలీసులను ఆదేశిస్తే మీరెందుకు .. ఎందుకు కష్టపడి చదివి శిక్షణ తీసుకున్నారు.. అని ప్రశ్నించారు. మీ పరిస్థితి దారుణంగా ఉంది మారాలని సలహా ఇచ్చారు.

ఎస్పీపై చిందులేని నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఎవరో కాదు..జేసీ ప్రభాకర్ రెడ్డి బావమరిది. ఆయన భార్య సోదరుడే. ఈ విషయం కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు. నాకో న్యాయం…తన నా బావమరిదికో న్యాయం ఏమిటని మండిపడ్డారు. తేడా ఒక్కటే ఉందని అది రాజకీయ పార్టీ జెండాల్లో ఉందన్నారు. ఇంకెంత కాలం సజ్జల చేతుల్లో ఉంటారని.. బయటకు వచ్చి స్వతంత్రంగా పని చేయాలని జేసీ ప్రభాకర్ రెడ్డి సలహా ఇస్తున్నారు. అయితే.. పోలీసులు ఇలాంటివి పట్టించుకోడం మానేసి చాలా కాలం అయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏబీపీ సీఓటర్ సర్వే : బీఆర్ఎస్‌కు ఒక్కటే !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయినప్పటికీ పది వరకూ లోక్ సభ సీట్లను గెల్చుకునే అవకాశం...

ఏబీపీ సీఓటర్ సర్వే : టీడీపీ కూటమికి 20, వైసీపీకి 5 లోక్‌సభ సీట్లు

ఎన్డీఏ కూటమి బలం రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందని సర్వేల వెల్లడిస్తున్నయి. అత్యంత ఖచ్చితంగా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తుందని పేరున్న ఏబీపీ- సీఓటర్ ఎన్నికలకు ముందు నిర్వహించిన...

సునీత సాక్ష్యాలకు పాత ఆరోపణలే అవినాష్ రెడ్డి కౌంటర్ !

వివేకా హత్య కేసులో సునీత జస్టిస్ ఫర్ వివేకా పేరుతో పెడుతున్న ప్రెస్ మీట్లు వెల్లడిస్తున్న సంచనల విషయాలతో అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతోంది. స్పందించకపోతే నిజం అని...

రాయి కేసు : లీకులిచ్చి జగన్ పరువు తీసిన పోలీసులు !

అనవసర డ్రామాలతో భద్రతా వైఫల్యమని పోలీసుల్ని చేతకాని వాళ్లుగా చేస్తున్నారని కోపం వచ్చిందేమో కానీ విజయవాడ పోలీసులు వైసీపీతో పాటు జగన్ పరువు తీసే లీకులు మీడియాకు ఇచ్చారు. జగన్ పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close