కేటీఆర్‌ని కాదు దళితుడ్ని సీఎం పీఠంపై కూర్చోబెట్టాలట..!

టీఆర్ఎస్‌లో నాయకత్వ మార్పుపై చర్చ జరుగుతూండటంతో ఆ పార్టీతో మైండ్ గేమ్ ప్రారంభించారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. కేటీఆర్‌పై ఇతర నేతల్లో అసంతృప్తిని పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఆయన సీనియర్ మంత్రి ఈటల రాజేందర్‌ను దువ్వేందుకు తీవ్రంగా ట్రై చేస్తున్నారు. టీఆర్ఎస్‌లో కేటీఆర్ సీఎం కావాలని ఉద్యమ ద్రోహులు మాత్రమే కోరుకుంటున్నారని.. నిజమైన ఉద్యమకారులకు ఇష్టం లేదని బండి సంజయ్ చెబుతున్నారు. అదే సమయంలో.. మంత్రి ఈటలపై సానుభూతి చూపిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఈటలకు టీఆర్ఎస్‌లో అన్యాయం జరిగిందని… ప్రభుత్వానికి ఇబ్బంది వచ్చినప్పుడల్లా ఈటలను ముందుపెట్టి కేసీఆర్‌ బయటపడుతున్నారని బండి సంజయ్‌ అంటున్నారు.

కొద్ది రోజుల క్రితం.. కేటీఆర్ మంత్రివర్గంలో చోటు దక్కక పోతే ముగ్గురు ఎమ్మెల్యేలు సొంత పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారని బండి సంజయ్ ప్రకటించారు. కేటీఆర్‌ను సీఎం చేస్తే మంత్రివర్గ ప్రక్షాళన తప్పదని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఈ సారి మంత్రి పదవులు దక్కవని ప్రచారం జరుగుతున్న వారిలో ఈటల, గంగుల కమలాకర్ లాంటి వాళ్ల పేర్లు ఉన్నాయి. ఈ కారణంగానే ఈటలను మరింత దువ్వే ప్రయత్నాన్ని బండి సంజయ్ చేస్తున్నారని అంటున్నారు. అదే సమయంలో.. కేసీఆర్ తాను సీఎంగా ఉండలేకపోతే.. మార్చాలని అనుకుంటే … తన తర్వాతైన దళితుడిని సీఎం చేయాలని ప్రజలు కోరుతున్నారనే కొత్త వాదనను తెరపైకి తెచ్చారు.

టీఆర్ఎస్ లో నాయకత్వ మార్పుపై చర్చ పెరిగే కొద్దీ.. బండి సంజయ్.. ఆ విషయంలో టీఆర్ఎస్‌ను ఇరికించేందుకు తనదైన శైలిలో ప్రకటనలు చేసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి స్థాయిలో నాయకత్వ మార్పిడి అనేది అంత సులభం కాదు. పైగా ఇప్పుడు టీఆర్ఎస్ గడ్డు పరిస్థితుల్లో ఉంది. ఈ పరిస్థితిని బండి సంజయ్ అడ్వాంటేజ్‌గా తీసుకోవాలని చూస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close