బిడెన్ ప్యాకేజీ : ఒక్కో అమెరికన్ పౌరునికి రూ. లక్షన్నర..!

నల్లధనాన్నంతా వెనక్కి తెస్తాం.. ప్రతి ఒక్కరి అకౌంట్‌లో పదిహేను లక్షలేస్తాం అని బీజేపీ చెప్పింది కానీ.. ఇప్పటి వరకూ వేసింది లేదు.. కానీ నల్లధనం మొత్తం వెనక్కి తెచ్చామని కూడా చెప్పారు. దీంతో ప్రజలకు ఆశల్లేవు. కరోనా సమయంలో ఇరవై లక్షల కోట్ల ప్యాకేజీ అని చెప్పారు కానీ.. అందులో ఎవరికైనా సాయం అందిందని అనుకోలేని పరిస్థితి. ఆ పేరుతో పెట్రోల్ రేట్లు మాత్రం లీటర్‌కు రూ. పదిహేను చొప్పున పెంచేశారు. కానీ అమెరికాలో పరిస్థితి అలా లేదు. బ్లాక్ మనీ గురించి ఎన్నికల్లో ప్రచారం చేయకుండానే… నగదు బదిలీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇవ్వకుండా… అమెరికా అధ్యక్షుడు జో బిడెన్… పదవి చేపట్టగానే.. ప్రజలందర్నీ ఆదుకోవడానికి ఓ సంచలన ప్యాకేజీకి ఆమోదం తెలిపారు.

దాని ప్రకారం.. ప్రతి అమెరికా పౌరుడి అకౌంట్‌కు రెండు వేల డాలర్లు జమ అవుతాయి. అంటే.. మన రూపాయల్లో లక్షన్నర అన్నమాట. అమెరికా రెస్క్యూ ప్లాన్‌ పేరుతో లక్షా 90వేల కోట్ల డాలర్ల ప్యాకేజీని బైడెన్ ప్రకటించారు. ఆర్థికంగా కుంగిపోయిన ఇతర రంగాలకు పెద్ద ఎత్తున ప్యాకేజీలు ప్రకటించనున్నారు. నిజానికి గతంలో ట్రంప్ కూడా ఇలాంటి భారీ ప్యాకేజీని ఓ సారి ప్రకటించారు. రూ.66లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించి.. ప్రజలకు పంపిణీ చేశారు.

అమెరికాలో ప్యాకేజీ అంటే నేరుగా నగదు బదిలీనే. ఇప్పటి వరకూ అమలు చేస్తున్న వాటికి ప్యాకేజీ పేరు పెట్టరు. కొత్తగా చేసే సాయన్నే ప్రకటిస్తారు. ఉద్యోగాలు కోల్పోయిన వారికి.. వ్యాపారాల్లో నష్టపోయిన వారికీ.. ఇలా అందరికీ .. ఉద్దీపన ప్రయోజనాలను బ్యాంకు అకౌంట్ల ద్వారా అందించారు. ఆ సాయానికి అదనంగా జో బిడెన్ అందించబోతున్నారు. దీంతో అమెరికన్ ప్రజలకు .. అక్కడి ఆర్థిక వ్యవస్థకు మరింత ఊపు వచ్చే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఓటేస్తున్నారా ? : ఇసుక మాఫియాను గుర్తుకు తెచ్చుకోండి !

ఇసుక..ఈ మాట వింటే ఏపీ ప్రభుత్వ పెద్దల కడుపు నిండిపోతుంది. ఎందుకంటే ఇసుకను తినమరిగి జీర్ణించుకోవడానికి అలవాటు పడ్డారు మరి. అధికారంలోకి వచ్చేటప్పటికి ఉచిత ఇసుక విధానం అమల్లో ఉండేది. రాగానే ...

ఈ రోజూ ప్రచారానికి జగన్ బ్రేక్ – నిస్పృహ !

వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరాశ నిస్పృహల్లోకి చేరిపోయారు. ఆయన ప్రచారానికి ఆసక్తి చూపించడం లేదు. ఐదేళ్లు బయటకు రాకుండా ఉన్న ఆయనకు ఇప్పుడు నిరంతరాయంగా ప్రచారం చేయడం బద్దకంగా మారింది. ఓ...

నో వ్యాక్సిన్…ఇండియాలో వెస్ట్ నైల్ ఫీవర్ టెన్షన్..

కరోనా పీడ విరగడ అయిందని జనం రిలాక్స్ అవుతుండగా మరో కొత్త జ్వరం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. కేరళలో వెలుగుచూసిన ఈ కొత్తరకం జ్వరం అక్కడి ప్రజలను వణికిస్తోంది. దీనికి వ్యాక్సిన్...

కూటమికి సంఘీభావం తెలుపుతూ జర్మనీలో ప్రవాసాంధ్రుల ర్యాలీ

మరో వారం రోజుల్లో (మే 13న) జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన-భాజాపా కూటమికి సంఘీభావం తెలుపుతూ ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో ఆదివారం, మే 5 తారీఖునాడు ఫ్రాంక్ఫుర్ట్ నగరంలో ప్రవాసాంధ్రులు ర్యాలీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close