పంచాయతీ ఎన్నికలు జరగాల్సిందే : సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టులోనూ ఏపీ ప్రభుత్వానికి అనుకూల తీర్పు రాలేదు. పంచాయతీ ఎన్నికలు కొనసాగించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటూ.. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. ఎన్నికలు యథావిధిగా కొనసాగుతాయ విస్పష్టం చేసింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగ విచ్ఛిన్నాన్ని అంగీకరించబోమని.. వ్యాక్సినేషన్‌ ఎన్నికలకు అడ్డంకి కానే కాదని తేల్చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిర్ణయంలో జోక్యం చేసుకునేది లేదని తేల్చేసింది.

ఉద్యోగ సంఘాలు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని .. ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రక్రియలో ప్రభుత్వ ఉద్యోగుల జోక్యం మంచిది కాదని సుప్రీంకోర్టు అభిప్రాయం పడింది. రెండు వ్యవస్థల మధ్య ఉన్న వ్యవహారంతో మీకేం సంబంధమని ఉద్యోగులను ప్రశ్నిచింది. ఉద్యోగులు పని చేయకుండా పిటిషన్ వేయడం ప్రమాదకరమని.. సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో ఎక్కడా ఎన్నికలు జరగట్లేదా అని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ప్రశ్నించారు. ఎన్నికలు రాజ్యాంగ ప్రక్రియలో భాగమని కరోనా ఉన్నప్పుడు ఎన్నికలు కావాలన్నారని గుర్తు చేశారు. ఈసీని తప్పుబడుతూ దురుద్దేశాలు ఆపాదిస్తున్నారని జస్టిస్ కౌల్ వ్యాఖ్యానించారు. ఎస్‌ఈసీ సమావేశానికి ఉద్యోగులు ఎందుకు హాజరు కాలేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అందరి చూపు ఏపీ ప్రభుత్వం ఉద్యోగులపై పడింది.

సుప్రీంకోర్టు ఆదేశించినా తాము ఎన్నికల్లో పాల్గొనబోమని కొన్ని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ఇప్పటికే ఎస్‌ఈసీని ఉద్యోగులు ధిక్కరించారు. సీఎస్ నుంచి కింది స్థాయి ఆర్వో వరకూ ఎవరూ ఎన్నికల విధులు చేపట్టలేదు. ఇప్పుడు.. ఎస్‌ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. తీర్పు అధ్యయనం తర్వాత నిర్ణయం తీసుకుంటామని విజయసాయిరెడ్డి ప్రకటించి… తమ ఉద్దేశాలను చెప్పకనే చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close