మళ్లీ వైసీపీ వాదన ఎత్తుకున్న బీజేపీ విష్ణు..!

భారతీయ జనతా పార్టీ నేత విష్ణువర్ధన్ రెడ్డి… ప్రభుత్వంపై అప్పుడప్పుడూ సుతిమెత్తగా విమర్శలు చేస్తారు కానీ.. కీలకమైన సమయాల్లో వారి వాదనను సమర్థించడానికి ఎలాంటి మొహమాటాలు పెట్టుకోరు. తాజాగా అన్నీ వదిలేసి… వైసీపీ నేతలు.. ఎస్‌ఈసీ తీసుకొచ్చిన ఓ యాప్ మీద విమర్శలు చేస్తున్నారు. ఆ యాప్ వల్ల ఏదేదో జరిగిపోతుందని పేపర్లలో రాసుకుంటున్నారు. ఇదే ఇప్పుడు.. విష్ణువర్ధన్ రెడ్డి అజెండాగా మార్చుకున్నారు. ఆ యాప్ గురించి డీటైల్డ్‌గా చెప్పాలని ట్వీట్ చేశారు. అందులో మొత్తం సాక్షి పత్రిక వ్యక్తం చేసిన అనుమానాలే ఉన్నాయి. బహుశా.. ఈ యాప్ పై అనుమానాల్ని మరింత విస్తృతం చేయాలన్న ఉద్దేశంతో… విష్ణువర్ధన్ రెడ్డితో ఉన్న సత్సంబంధాలతో వైసీపీ నేతలే ఇలా ప్రకటన చేయించి ఉంటారని అనుమానిస్తున్నారు.

ఎందుకంటే.. ఎస్‌ఈసీ ఉపయోగించాలని చెప్పిన యాప్ ఇప్పటికి ఉపయోగంలో ఉందో లేదో తెలియదు. ఆ యాప్ గురించి ఎలాంటి ప్రచారమూ చేయడం లేదు. అయితే ఆ యాప్ ఒక్క వెబ్ కాస్టింగ్ కాకుండా.. పోలింగ్ బూత్ బయట ప్రాంతాలపై కూడా నిఘా పెడుతుంది. ఇది మంచిదే కదా అన్న అంశాన్ని మాత్రం తీసుకోవడం లేదు. పోలింగ్ బూత్ ల బయట మొత్తం చేయాల్సిందంతా చేసేస్తున్నారు. బెదిరింపులు.. ప్రలోభాలతో పని కానిస్తున్నారు. అందుకే ఎస్‌ఈసీ మరింత కొత్తగా ఆలోచించారు. పోలింగ్ బూత్ బయట కూడా నిఘా పెట్టేలా యాప్ తీసుకొచ్చానని ప్రకటించారు. ఆ యాప్ ఎవరు చేయించారు… ప్రైవేటు వాళ్లా.. గవర్నమెంట్ వాళ్లా.. అంటూ లేని పోని అనుమానాలు సాక్షి మీడియా తరహాలో విష్ణువర్ధన్ రెడ్డి వ్యక్తం చేయడం… ఆయనకు ప్రత్యేకంగా సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరంలేదని గుర్తు చేస్తోందని అంటున్నారు.

నిమ్మగడ్డ ఎన్నికల కోసం ఆ యాప్ వినియోగించడం చట్ట విరుద్ధమైతే.. కోర్టులకు వెళ్లడం క్షణాల్లో పని . ఎవరు నిర్వహించినా యాప్ ను సాఫ్ట్ వేర్ కంపెనీలే రూపొందిస్తాయి. అయితే అది టీడీపీ వాళ్లు తయారు చేసిన యాప్ అని సాక్షి చెబుతూంటే.. దాన్నే విష్ణువర్ధన్ రెడ్డి హైలెట్ చేస్తున్నారు. ఇలాంటి నేతల వల్లనే… వైసీపీ బీ టీంగా బీజేపీని గుర్తిస్తున్నారు తప్ప… ప్రత్యామ్నాయంగా కాదన్న చర్చ సహజంగానే నడుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంద్రానికి నిప్పెట్టిన దేవర

https://youtu.be/CKpbdCciELk?si=XoyRoPJZB05oVwwN ఎప్పుడెప్పుడా అని ఎన్టీఆర్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన ‘దేవర’ ఫియర్ సాంగ్‌ వచ్చేసింది. రేపు (మే 20).. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా టీమ్‌ తొలి పాటను విడుదల చేసింది. పేరుగా తగ్గట్టుగానే టెర్రిఫిక్...

చోరుడు రివ్యూ : అడవి దొంగ పాయింట్ బావుంది కానీ…

స్టార్ కంపోజర్ గా కొనసాగుతూనే మరోవైపు నటునలో కూడా బిజీగా వున్నారు జీవి ప్రకాష్ కుమార్. ఇటీవల ఆయన నుంచి వ‌చ్చిన‌ 'డియర్' సినిమా నిరాశపరిచింది. ఇప్పుడు ఆయన టైటిల్ రోల్ చేసిన...

అమెరికాలో వల్లభనేని వంశీ

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అమెరికా వెళ్లారు. పోలింగ్ అయిపోయిన తర్వాత చాలా మంది వెళ్లారు కానీ.. అందరూ తిరిగి వస్తారు.. కానీ వంశీ వస్తారా లేదా అన్నది మాత్రం...

ఫాక్స్ లింక్ పరిశ్రమ తిరుపతి నుంచి చెన్నైకి జంప్ !

యాపిల్‌కు విడిభాగాలు తయారు చేసి సప్లయ్ చేసే ఫాక్స్ లింక్స్ కంపెనీ ఏపీ నుంచి తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోయింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నారా లోకేష్ ఈ పరిశ్రమను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close