జనసేన దూకుడు.. బీజేపీ సణుగుడు..! ఇంతకీ తిరుపతి అభ్యర్థెవరు..?

ఆంధ్రప్రదేశ్ పల్లెల్లో ఏ పార్టీ బలం ఎంత అనేది తేలిపోయింది. నాలుగు విడుతల పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి. అధికార, ప్రతిపక్షాలను పక్కన పెడితే… బీజేపీ, జనసేనల్లో ఎవరి బలం ఏమిటో క్లారిటీ వచ్చేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న తాము .. ఏపీలో అధికారం చేపట్టడానికి ఒక్క ఓటు దూరంలో ఉన్నామని బీజేపీ నేతలు చెబుతూ ఉంటారు. అయితే ఆ ఒక్క ఓటు వారికి అందడం లేదు. చాలా దూరంలో ఉండిపోతోంది. కానీ జనసేనకు మాత్రం చాలా దగ్గరగా కనిపిస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ ఎక్కడా పెద్దగా ప్రభావం చూపించలేదు. పట్టుమని పది పంచాయతీల్లో తమ మద్దతుదారులు గెలిచారని చెప్పుకోలేని పరిస్థితి.

ఏపీ బీజేపీలో తాము పెద్ద తోపు, తురుం ఖాన్ లీడర్లమని చెప్పుకునేవారికి కొదవ ఉండదు. కానీ వారికి స్వగ్రామాల్లోనే పట్టు లేదని తాజాగా తేలిపోయింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో ఉన్న వారిలో ఒక్కరంటే ఒక్కరు కూడా తమ స్వగ్రామంలో ఇలా బీజేపీ పంట పండించామని ప్రకటించలేదు. అదే సమయంలో బీజేపీకి వలస నేతల బలం కొన్ని చోట్ల కలిసి వచ్చింది. గత ఎన్నికల తర్వాత భద్రత భయంతో టీడీపీని వీడి బీజేపీలో కొంత మంది నేతలు చేరారు. వారి గ్రామాల్లో బీజేపీకి మెరుగైన ఫలితాలొచ్చాయి. సీఎం రమేష్ స్వగ్రామం పొట్లదుర్తిలో బీజేపీ అభ్యర్థి మంచి ఆధిక్యంతో గెలిచారు. ఇవి మినహా.. పెద్దగా సాధించిందేమీ లేదు.

అయితే జనసేన అలా కాదు. కింది స్థాయి లో తనకు బేస్ ఉందని నిరూపించుకోగలిగింది. బీజేపీతో పోలిస్తే.. జనసేన బలం పదిరెట్లు ఎక్కువని తేలింది. అందుకే ఇప్పుడు అందరూ తిరుపతి ఉపఎన్నికలో జనసేన పోటీ చేస్తుందా.. బీజేపీ పోటీ చేస్తుందా అన్న చర్చకు వెళ్తున్నారు. బలంపై క్లారిటీ వచ్చింది కాబట్టి.. బీజేపీ కూడా రియలైజ్ అవుతుందని జనసేన నమ్ముతోంది. తమ అభ్యర్థికే పోటీ చేసే చాన్స్ ఇస్తారని ఆశిస్తోంది. కానీ బీజేపీ అంత సామాన్యంగా ఎందుకు ఒప్పుకుంటుంది..?. ఈ విషయంలో పవన్ కల్యాణ్ తన మార్క్ రాజకీయాలు చేయకపోతే ఇబ్బంది పడటం ఖాయమని చెప్పుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాష్ బ్యాక్‌: క్రెడిట్ తీసుకోవడానికి భయపడ్డ త్రివిక్రమ్

ఇప్పుడు పరిస్థితి మారింది కానీ ఒకప్పుడు రచయిత అనే ముద్ర పడిన తర్వాత ఇక దర్శకుడయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. రైటర్ గానే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే అప్పట్లో దర్శకుడు కావాలని వచ్చిన...

టెట్ నిర్వహణపై సస్పెన్స్

తెలంగాణలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) పై సస్పెన్స్ నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టెట్ పరీక్షను వాయిదా వేస్తారా..?షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారా..?అని అభ్యర్థులు స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. టెట్ పరీక్షల...

సుకుమార్.. మీరు సూప‌రెహె..!

ఇండస్ట్రీలో డబ్బులు తేలిగ్గా ఇస్తారేమో కానీ క్రెడిట్లు ఇవ్వరు. ముఖ్యంగా రచయితలు ఈ విషయంలో అన్యాయమైపొతుంటారు. ఓ రైటర్ తో ట్రీట్మెంట్, డైలాగ్స్, స్క్రీన్ ప్లే.. ఇలా అన్నీ రాయించి, చివరికి ఆ...

జూన్ 27న ‘క‌ల్కి’

ప్ర‌భాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'క‌ల్కి' రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ఈ చిత్రాన్ని జూన్ 27న రిలీజ్ చేయాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించుకొంది. దీనిపై అతి త్వ‌ర‌లోనే నిర్మాత‌లు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close