ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి కేసీఆర్..!

మరొక్క ఓటమి ఎదురైతే.. టీఆర్ఎస్ పనైపోయిందని విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. ప్రచారం చేయాలని భావిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నవి పట్టభద్రుల నియోజకవర్గానికి. బహిరంగసభలు ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. ఓటర్లను నేరుగా కలవడం ఒక్కటే మార్గం. అయితే.. కేసీఆర్ అలా ఓటర్ల ఇళ్లకు వెళ్లి కలవడం సాధ్యం కాదు.. అదేమంత మంచి వ్యూహం కూడా కాదు కాబట్టి..కేసీఆర్ కొత్తగా ఆలోచించారు.. రోజు కొంత సమయం కేటాయించి.. ఓటర్లకు ఫోన్లు చేసి.. టీఆర్ఎస్ చేసిన పనులు వివరించి ఓటు వేయమని అభ్యర్థించబోతున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ఇప్పటికే పార్టీ వద్ద సంపూర్ణమైన డేటా ఉంది.ఓటర్ల లిస్ట్ ఉంది. వారిలో రోజూ విభిన్నవర్గాలకు చెందిన వారికి ఫోన్లు చేస్తే మంచి పలితం వస్తుందని భావిస్తున్నారు. ఇలా ఫోన్లు చేసి.. మాట్లాడటం అంటే కేసీఆర్ కు ప్రత్యేకమైన ఆసక్తి ఉంది.తాను గతంలో .. సంస్కరణలు చేపట్టాలనుకున్నప్పుడు.. రెవిన్యూ శాఖ సమస్యలపై.. వ్యవసాయ అంశాలపై ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు అదే పద్దతిలో ఎమ్మెల్సీ ఎన్నికలకూ ప్రచారం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని అనుకుంటున్నారు.

వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి కేసీఆర్ కు పెద్దగా టెన్షన్ లేదు. సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి .. ఎలాగోలా గెలిచి వస్తారని నమ్ముతున్నారు. అయితే.. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంపైనే కేసీఆర్ కు టెన్షన్ ఉంది. అక్కడ పెద్దగా టీఆర్ఎస్ గెలిచింది లేదు. పైగా యువత అసంతృప్తిగా ఉంది. ఇలాంటి సమయంలో… కేసీఆర్ రంగంలోకి దిగాల్సిన పరిస్థితి. పైగా పీవీ నరసింహారావు కుమార్తెను నిలబెట్టారు. గెలిపించడానికి ప్రయత్నించకపోతే.. తాము అనుకున్న లక్ష్యం పూర్తిగా రివర్స్ అయ్యే ప్రమాదం ఉంది.అందుకే కేసీఆర్ రోజుకు కొంత సమయం ఓటర్లకు ఫోన్లు చేసేందుకు కేటాయించనున్నట్లుగా తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close