చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై రేపు తేల్చనున్న హైకోర్టు..!

సీఐడీ తమపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ రాజకీయ కుట్ర ప్రేరేపితమని కొట్టి వేయాలని కోరుతూ.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ హైకోర్టులో క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. సీఐడీ నమోదు చేసిన కేసు సర్టిఫైడ్ ఎఫ్ఐఆర్ కాపీని కోర్టు నుంచి తీసుకున్న టీడీపీ లీగల్ సెల్ ప్రతినిధులు దానిపై న్యాయనిపుణుల నుంచి అభిప్రాయాలు సేకరించి … అసలు బాధితులు, లాభపడిన వారెవరూ ఫిర్యాదు చేయకుండా ధర్డ్ పార్టీ వ్యక్తి ఫిర్యాదు చేయడం… వెంటనే కేసు నమోదు చేయడం కుట్రలో భాగం అని సులువుగా అర్థం చేసుకోవచ్చని… క్వాష్ పిటిషన్ దాఖలు చేయాలని సలహా ఇచ్చారు.

న్యాయనిపుణుల సలహా మేరకు.. హైకోర్టులో క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. వెంటనే విచారణ జరపాలని న్యాయవాదులు కోరారు. అయితే.. రేపు విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది. అదే సమయంలో… చంద్రబాబు, నారాయణపై ఫిర్యాదు చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే .. సీఐడీ ఎదుట హాజరయ్యారు. తాను చేసిన ఫిర్యాదుకు సంబంధించి తన దగ్గర ఉన్న ఆధారాలను సమర్పించారు. తనకు దళితులు ఫిర్యాదులు చేశారని.. ఆ ఫిర్యాదులను సీఐడీకి అందచేశానని చెప్పుకొచ్చారు. అదే దళితులు నేరుగా సీఐడీకి ఫిర్యాదు చేయవచ్చు కదా.. మీకే ఎందుకు ఫిర్యాదు చేశారన్న అంశంపై ఆయన స్పష్టత ఇవ్వలేదు.

మంగళగిరిలో 500 ఎకరాల అసైన్డ్ భూముల్లో మోసం జరిగిందని.. తాడికొండలో 3 వేల ఎకరాలు ఇలాగే కొట్టేశారని అనుమానం ఉందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు, నారాయణ తప్పు చేయకుంటే విచారణ ఎదుర్కోవాలని సలహా ఇచ్చారు. అసలు బాధితులు ఉన్నారో లేదో తెలినీ ఈ కేసు చట్ట ప్రకారం చెల్లదని టీడీపీ లీగల్ సెల్ కూడా చెబుతోంది. నిజంగా బాధితులు ఉంటే.. వారితోనే ఫిర్యాదు ఇప్పించేవారు కాదా అని ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంపై రేపు హైకోర్టులో విచారణ జరగనుంది. రెండు రోజుల్లో ఈ కేసుకు సంబంధించి కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇప్పుడు ఏపీ మద్యం దుకాణాల్లో నో క్యాష్ పాలసీ !

నిన్నామొన్నటిదాకా క్యాష్ తప్ప మరో డిజటల్ పేమెంట్ తీసుకోలేదు ఏపీ మద్యం దుకాణాల్లో. ఇప్పుడు పాలసీ ఒక్క సారిగా మారిపోయింది. శుక్రవారం నుంచి ప్రభుత్వం పాలసీ మార్చేసింది. డిజిటల్ పేమెంట్...

ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటే ఏపీకి ఏం ఉపయోగం !?

విభజన చట్టంలో ఉన్న ఉమ్మడి రాజధాని అంశానికి జూన్ రెండో తేదీన ముగింపు రాబోతోంది. మరోసారి పొడిగింపు అసాధ్యం అని తెలిసినా సరే కొంత మంది ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కొనసాగించాలనే...

డ్రగ్స్ పార్టీ కేసు వైసీపీ చుట్టే తిరుగుతోంది !

డ్రగ్స్ అంటే వైసీపీ పేరు ఖచ్చితంగా వస్తోంది. ఏదో ఆషామాషీగా మీడియాలో వచ్చే కథనాలు కాదు. నేరుగా పోలీసు కేసుల్లో ఇరుక్కుంటున్నవారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఏ 2గా నిలిచిన...

పల్లీబఠాణి కామెంట్స్‌తో రాకేష్ రెడ్డిని ముంచిన కేటీఆర్

బిట్స్ పిలానీ గొప్ప కావొచ్చు కానీ మిగతా గ్రాడ్యూయేట్స్ అంతా పల్లీ బఠాణీలు అంటే ఎలా ?. కేటీఆర్ ఇది ఆలోచించలేదు. ప్రాస బాగుంది కదా అని అనేశారు. ఇప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close