వైసీపీని టెన్షన్ పెడుతున్న ఒంగోలు ఎంపీ..!

వైసీపీలో ఎంపీలు అందరూ అప్పుడప్పుడూ మీడియా ముందు హాజరు వేయించుకుంటూ ఉంటారు కానీ… ఒంగోలు ఎంపీ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఎన్నికలకు ముందు టీడీపీ టిక్కెట్ ఇచ్చినా… వైసీపీ ఒత్తిడితో ఆ పార్టీలో చేరి ఎంపీగా పోటీ చేసి గెలిచిన మాగుంట శ్రీనివాసులరెడ్డి … ఆ తర్వాత సైలెంటయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. చివరికి స్థానిక ఎన్నికల్లోనూ ఆయన ఎక్కడా కనిపించలేదు. ప్రస్తుతం పరిషత్ పోలింగ్ జరుగుతున్నా.. ఆయన ఎవరితోనూ టచ్‌లో లేరు. అసలు ఆయన ఏపీలో ఉంటున్నదే తక్కువని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఆయన చెన్నైలోనే చాలా కాలంగా ఉంటున్నారు.

పార్టీ అధినేత ఎంపీలు ఎవరూ ఫోకస్ కావడానికి అంగీకరించరు. ఈ కారణంగా ఆయనను మొదట్లోనే నియంత్రించారు. చివరికి ..ఎంపీగా పార్టీలో కూడా ప్రాధాన్యత లేకుండా చేశారు. ఏ కార్యక్రమాలనైనా… జగన్ దగ్గరి బంధువులైన బాలినేని శ్రీనివాసరెడ్డి… వైవీ సుబ్బారెడ్డి చేతుల మీదుగానే నడిచిపోతూంటాయి. సుబ్బారెడ్డి కన్ను.. ఎప్పుడూ.. ఎంపీ సీటు మీదనే ఉంటుంది. అవసరానికి… మాగుంటను పిలిపించి టిక్కెట్ ఇచ్చారు కానీ… రేపు అవసరం లేకపోతే.. పక్కన పెట్టేస్తారు. ఈ అంశాలన్నీ తెలుసు కాబట్టే మాగుంట సైలెంటయిపోయారు. గతంలో ఎంపీగా ఉంటే… వారానికి మూడు, నాలుగు రోజులైనా నియోజకవర్గంలో పర్యటించేవారు.

పార్టీలో ప్రాధాన్యత మాత్రమే కాదు.. ఏపీలో లిక్కర్ వ్యాపారాన్ని జగన్ దెబ్బతీయడం… పాత బకాయిలు ఏమీ చెల్లించకపోవడం కూడా.. మాగుంట ఆసంతృప్తికి మరో కారణం అంటున్నారు. మాగుంటకు బేవరేజెస్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ప్రఖ్యాత బ్రాండ్ల మద్యం ఉత్పత్తి చేస్తూంటారు. వీటి అమ్మకాలను ఏపీలో చేయడం లేదు. అలాగే గత ప్రభుత్వంలో సరఫరా చేసిన వాటికి చెల్లింపులు చేయాల్సి ఉంది. ఈ రెండూ కూడా.. చేయడం లేదు. దీంతో మాగుంట.. జగన్ వ్యూహాత్మకంగా తన వ్యాపారాన్ని కూడా దెబ్బకొడుతున్నారని భావించి.. ఆయన చెన్నైలో ఉండి వ్యాపారాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారని చెబుతున్నారు.ఆయన రఘురామలాగా రెబల్ కాకుండా సాత్వికుడు కాబట్టి… అలాగే రాజకీయం చేస్తున్నారని.. లేకపోతే జగన్‌కు ఇబ్బందయ్యేదన్న చర్చ వైసీపీలో సాగుతోంది .

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close