ఇక ఆ ఎన్నికల జోలికి వద్దనుకుంటున్న ఏపీ సర్కార్..!?

ఆంధ్రప్రదేశ్ కొత్త ఎస్ఈసీగా నీలం సాహ్ని బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే పనిలోకి దిగారు. పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేశారు. హైకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉన్నా పట్టించుకోలేదు. ఆ వివాదం … ఎన్నికలు జరిగి.. కౌంటింగ్ కోసం ఎదురు చూడాల్సిన స్టేజ్‌లో ఉంది. అయితే ఇంకా.. దాదాపుగా ముఫ్పైకి పైగా మున్సిపాల్టీలకు.. రాజమండ్రి, నెల్లూరు లాంటి కార్పొరేషన్లకు ఎన్నికలు జరగాల్సి ఉంది. వాటిని కూడా ఈ నెలలోనే పూర్తి చేస్తామని.. మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు. షెడ్యూల్ కూడా రెడీ అయిందని వైసీపీ అధికారిక మీడియాలో ప్రచారం జరిగింది. అయితే.. అవన్నీ ఆగిపోవడానికి కారణం కోర్టు కేసులు.

సమీప గ్రామాలను మున్సిపాల్టీల్లో విలీనం చేయడంతో.. ఆయా గ్రామాల వారు కోర్టులకు వెళ్లారు. దాంతో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాలేదు. అయితే కోర్టు కేసుల్ని కూడా పెద్దగా పట్టించుకోకుండా నోటిఫికేషన్ ఇచ్చేస్తారన్న ప్రచారం జరిగింది. ఎందుకంటే… నోటిఫికేషన్ ఇచ్చేశాక.. కోర్టు జోక్యం చేసుకోకూడదన్న వాదన వినిపిస్తారని కూడా చెప్పుకున్నారు. అయితే అనూహ్యంగా ఇప్పుడు హైకోర్టులో ఎస్ఈసీ తరపు న్యాయవాది యూటర్న్ తీసుకున్నారు.కోర్టు కేసులు, జనాభా లెక్కింపు, ఓటర్ల జాబితాలో ఇబ్బందులున్నాయని …కోర్టులో పిటిషన్లు పెండింగ్‌లో ఉండటంతో ఎన్నికలు నిర్వహించబోమని స్పష్టం చేసింది.

సమస్యలు తొలిగాక ఎన్నికలు జరుపుతామని తెలిపింది. కోర్టు కేసులు తేలడం అంత తేలిక కాదు. ప్రస్తుతం కరోనా కారణంగా విచారణలు కూడా ఆలస్యం అవుతున్నాయి. ఈ ప్రకారం చూస్తే.. ఇక మున్సిపల్ ఎన్నికల ఆలోచన ప్రభుత్వం చేయకపోవచ్చునని చెబుతున్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితులు.. కర్ఫ్యూ, లాక్ డౌన్ దిశగా వెళ్తున్నందున ఎన్నికలు పెట్టే పరిస్థితి కూడా లేదని చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close