ఈటెల పై కాంగ్రెస్, బిజెపి నేతల సానుభూతి

హఠాత్తుగా ఈటెల రాజేందర్ పై కెసిఆర్ అనుకూల మీడియాలో వచ్చిన కబ్జా వార్తలు తెలంగాణ ప్రజలను నివ్వెరపరిచాయి. ప్రస్తుత మీడియా ప్రజల వద్ద విశ్వాసం పూర్తిగా కోల్పోవడంతో ఈ వార్తలన్నీ, ఈటెల రాజేందర్ ని తొక్కడానికి అధికార టీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలే అని ప్రజలు భావించారు. అయితే ఈటెల రాజేందర్ పై ఇటు కాంగ్రెస్ అటు బిజెపి నేతల నుండి సానుభూతి పెల్లుబుకుతోంది. వివరాల్లోకి వెళితే..

గతంలో కాంగ్రెస్ నేతగా ఉండి ఇటీవల బీజేపీ నేత గా మారిన విజయశాంతి ఈటెల రాజేందర్ వ్యవహారంపై స్పందించారు. ఆవిడ ట్వీట్ చేస్తూ, “లక్ష కోట్లు మింగిన ఈ దొర కుటుంబం బడుగు బలహీన వర్గాలపై చేస్తున్న అణచివేతల ప్రక్రియలో తమ్ముడు ఈటెల రాజేందర్ గారిది మరో దుర్మార్గం. తెలంగాణ ప్రజలకు ఈ దొర అహంకారపు ధోరణుల నుండి త్వరలో విముక్తి తప్పక లభించి తీరుతుంది.” అని రాసుకొచ్చారు. అయితే గతంలో విజయశాంతి ఇలాగే కేసీఆర్ చేతిలో వెన్నుపోటుకు గురయ్యారని, ఇప్పుడు కెసిఆర్ ఈటెల రాజేందర్ ను కూడా ఇలాగే వెన్నుపోటు పొడుస్తూ ఉండడమే విజయశాంతి సానుభూతికి కారణం అని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. అదేవిధంగా బిజెపి నేత బండి సంజయ్ కూడా ఈటెల రాజేందర్ పై సానుభూతి ప్రకటిస్తూ కెసిఆర్ అరాచకాలను విమర్శించారు.

మరొక పక్క కాంగ్రెస్ నేత వీహెచ్ ఇదే అంశంపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ న్యాయం అన్నది అందరికీ ఒకేలా ఉండాలని, ఇటీవల టిఆర్ఎస్ నేత మల్లారెడ్డి ఆడియో ఆధారాలతో అడ్డంగా దొరికిపోతే ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకొని ప్రభుత్వం బిసి మరియు వెనుకబడిన వర్గాలకు చెందిన నేతలపై మాత్రం ఆధారాలు లేకపోయినా చర్యలకు సిద్ధం అవుతోందని విమర్శించారు. మల్లారెడ్డి పై ఆధారాలు ఉన్నా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. మరొక పక్క ఇంకొక కాంగ్రెస్ నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ, కెసిఆర్ కుటుంబం చేస్తున్న అక్రమాలపై కూడా ఇదే విధంగా చర్యలు తీసుకోవాలని , కేటీఆర్ పై కూడా ఇటువంటి కబ్జా ఆరోపణలు ఉన్నాయని మరి వాటిపై ఎందుకు చర్య తీసుకోరని ప్రశ్నించారు.

మొత్తం మీద అధికార పార్టీ మంత్రి పై అవినీతి ఆరోపణలు వస్తే, విపక్షాలు మంత్రిపై గురి పెట్టకుండా కెసిఆర్ కుటుంబం పై గురిపెట్టి మంత్రిని సమర్థిస్తూ మాట్లాడడం ఆశ్చర్యకర పరిణామం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close