అవినీతి చేసిన వారికి శిక్ష పడాల్సిందే: ఈటెల వ్యవహారంపై షర్మిల

ప్రస్తుతం తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ వ్యవహారం తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. ఈటెల రాజేందర్ అవినీతి కి తగిన శిక్ష పడాలని ఒక వర్గం వాదిస్తూ ఉంటే, ఇదంతా కెసిఆర్ రాజకీయ ఎజెండా అని, బిసి నేత అయిన ఈటెల ను బలిపశువును చేస్తున్నారని మరొక వర్గం వారు వాదిస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై అటు కాంగ్రెస్ నేతలు ఇటు బీజేపీ నేతలు స్పందించారు. తాజాగా ఈ వ్యవహారంపై వైఎస్ షర్మిల స్పందిస్తూ అవినీతి చేసిన వారు ఎంతటి వారైనా శిక్ష పడాల్సిందే అంటూ వ్యాఖ్యానించారు. వివరాల్లోకి వెళితే..

వైఎస్ షర్మిల ఈటెల రాజేందర్ వ్యవహారం పై ట్వీట్ చేస్తూ, “ఎవరు అవినీతి చేసినా వారికి శిక్ష పడాల్సిందే, ఈటెల అవినీతి పై మీ ఎంక్వైరీని స్వాగతిస్తున్న .. అయ్యా KCR దొరగారు .. ఇది పొమ్మనలేక పొగ పెట్టడమా .. లేక .. మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారని .. వాళ్ళ పదవికి ఏసరు పెట్టడమా? ఈ రోజు ఈటెల పై 10 మంది కంప్లైంట్ చేయగానే 10 నిమిషాల్లో స్పందించి ఎంక్వైరీకి ఆదేశించిన మీరు, అన్యాయం జరుగుతుంది చంద్రశేఖరా ..అని మంత్రి మల్లారెడ్డి పై, MLA ముత్తిరెడ్డి పై ఆరోపణలు చేసినప్పుడు.. మా భూములను MLA సైదిరెడ్డి కబ్జా చేసిండని జనం మోత్తుకొన్నప్పుడు మీకు వినిపించలేదా? మీకు సలాంలు కొట్టి .. గులాంగిరి చేసే వాళ్లకు ఏ ఆపద ఉండదా? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే .. అవినీతి ఆరోపణలు ఎదురుకొంటున్న మీ పార్టీ ప్రతినిధులపై కూడా ఎంక్వైరీకి ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నం.” అని రాసుకొచ్చారు.

అయితే షర్మిల వ్యాఖ్యలపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. అవినీతి చేసిన వారికి ఎంతటివారైనా శిక్ష పడాలని షర్మిల వ్యాఖ్యానించడం మంచి కామెడీ అని, తమ ఇంట్లో ఇదే అవినీతి ఆరోపణలపై వైయస్ జగన్ కేసును ఎదుర్కొంటూ ప్రస్తుతం బెయిల్ పై ఉన్నాడని వారు గుర్తు చేస్తున్నారు. మొత్తంమీద షర్మిల ఎవరి పై ఏ రకంగా రాజకీయ వ్యాఖ్యానాలు చేసినా, అవి తిరిగి తమ కుటుంబానికే రివర్స్ లో తగులుతూ ఉండడం గమనార్హం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇరుక్కున్న సీఎస్ జహవర్ రెడ్డి !

రిటైరయ్యే ముందు సీఎస్ జవహర్ రెడ్డి శేష జీవితం అంతా కేసుల్లో నలిగిపోవడానికి అవసరమైన సాక్ష్యాలతో ఇరుక్కుపోయారు. వైసీపీ నేతలతో కలిసి ఆయన కుమారుడ్ని ధనవంతుడ్ని చేయాలన్న తపన సీఎస్ ఎడాపెడా చేసిన...

మరో చోట భవిష్యత్ వెతుక్కుంటున్న బీఆర్ఎస్..?

పార్టీ జన్మస్థానం తెలంగాణలో ఆటుపోట్లను ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ కు ఇంకా తత్త్వం బోధపడినట్లు లేదు. లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అంచనా వేయకుండా మహారాష్ట్రలో...

తెలంగాణ అంటే కాంగ్రెస్ – బీఆర్ఎస్ కాదు !

తెలంగాణ తెచ్చింది తామేనని .. తమ నాయకుడు కేసీఆర్ తెలంగాణ బాపు అని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకుంటూ వచ్చారు కానీ.. ఇప్పుడు పరిస్థితి తిరగబడింది. తెలంగాణపై వారి ముద్ర లేకుండా ...

కేసీఆర్ కు అన్నీ తెలుసు… ఢిల్లీ లిక్క‌ర్ కేసులో సంచ‌ల‌నం!

దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్క‌ర్ కేసు బిగ్ ట‌ర్న్ తీసుకునేలా క‌న‌ప‌డుతోంది. ఇప్ప‌టికే ఈ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జైలుపాలు కాగా... మాజీ సీఎం కేసీఆర్ కు ఈ స్కాం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close