కేటీఆర్‌కు పట్టాభిషేకమా..? కేబినెట్ మార్పుచేర్పులేనా..?

తెలంగాణలో అన్ని రకాల ఎన్నికలు నేటితో పూర్తవుతున్నాయి. మినీ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కూడా జరుగుతోంది. వాటిలోనూ టీఆర్ఎస్ స్వీప్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో కేసీఆర్ భవిష్యత్ రాజకీయాలకు తొలి అడుగును.. ఈటలపై వేటు రూపంలో వేసినట్లుగా కళ్ల ముందు ఉంది. తర్వాత కేసీఆర్ అడుగులేమిటన్నదానిపై టీఆర్ఎ్‌లో చర్చ జరుగుతోంది. మంత్రివర్గ పునర్‌వ్యవస్ధీకరణ అంశానికి సంబంధించి చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఇప్పుడు కొత్త చర్చ కూడా ప్రారంభమైంది. కేటీఆర్‌కు పట్టాభిషేకం అంశం మరోసారి తెరపైకి వస్తోంది. కేటీఆర్‌ను సీఎంను చేయడానికే కేసీఆర్ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది.

కొంత మంది మంత్రుల్ని తప్పించి కొత్త వారికి చాన్సిస్తారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది.  దుబ్బాక ఉపఎన్నక, గ్రేటర్ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యత మొత్తం ఆయా ప్రాంతాల్లోని మంత్రులదేనని.. గతంలోనే కేసీఆర్ పార్టీ నేతలకు స్పష్టం చేశారు. దుబ్బాక.. గ్రేటర్‌లో మంచి ఫలితాలు రాలేదు. ఆ తర్వాత ఎన్నికల్లో మంచి ఫలితాలొచ్చాయి. ఈటలతోపాటు మరికొంత మంది మంత్రులపైనా గతంలో వ్యతిరేక ప్రచారం జరిగింది. గతంలో కరీంనగర్‌కు చెందిన ఓ మంత్రిపై.. టీఆర్ఎస్ అనుకూల మీడియా విస్తృతమైన కథనాలు ప్రసారం చేసింది. మంత్రి మల్లారెడ్డిపై భూకబ్జా కేసు కూడా నమోదయింది. ఇటీవల ఓ రియల్ ఎస్టేట్ వెంచర్‌లో లంచాలు డిమాండ్ చేసిన ఆడియోవెలుగులోకి వచ్చింది. ఇలా మరో ఇద్దరు.. ముగ్గురు మంత్రులు కేసీఆర్ విశ్వాసాన్ని కోల్పోయారని అంటున్నారు. వారందరికీ… మంత్రి పదవి ఊస్ట్ అనే సూచనలని చెబుతున్నారు.

అయితే ఇప్పుడు అసలు విషయం మంత్రివర్గంలో మార్పు చేర్పులు కాదని.. మొత్తం ..  కేటీఆర్‌కు పట్టాభిషేకం చేసి.. మొత్తం టీంనే మార్చేస్తారని అంటున్నారు . కేటీఆర్ విషయంలో సానుకూలంగా లేని కొంత మంది మంత్రులను కేసీఆర్ అందుకే టార్గెట్ చేసుకున్నారని చెబుతున్నారు. కేటీఆర్ పట్టాభిషేకం అనేది.. కేసీఆర్‌ ఆలోచనల్లో ఎప్పటి నుండో ఉంది. ఆయన సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత బీజేపీ కాస్త బలహీనపడిందేనేప్రచారం జరుగుతూండటం… జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు.. మమతా బెనర్జీతో పాటుగా కీలక పాత్ర పోషించే అవకాశం రావడం.. వంటి కారణాలతో… కేసీఆర్ వేగంగా అడుగులు వేస్తున్నారని అంచనా వేస్తున్నారు.

మొత్తానికి కేసీఆర్ రాజకీయ దురంధరుడు. తాను అనుకున్న పనిని.. అనుకున్నట్లుగా చేస్తారు. ఈ సమయంలో ఈటలపై వేటును అంత కాకతాళీయంగా వేసి ఉండరు. దీని వెనుక అసలు వ్యూహం ఏమిటో.. వేగంగానే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కూటమిదే విజయమని వైసీపీ అభ్యర్థుల బెట్టింగులు..!!

స్వయంగా జగన్ రెడ్డి గతంలో కన్నా ఎక్కువ సీట్లు గెలుస్తామని ప్రకటించినా వైసీపీలో ఆ ధీమా ఏమాత్రం కనిపించడం లేదు. ఇప్పటికే బెట్టింగ్ రాయుళ్లు కూటమిదే అధికారమని లక్షల్లో బెట్టింగ్ కాస్తుండగా...వైసీపీ తరఫున...

ఓట్లు ఎలా వస్తాయో అలానే మోదీ ప్రచారం !

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలి కాలంలో మతప రమైన అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. కాంగ్రెస్ వస్తే రామ మందిరాన్ని బుల్డోజర్లతో కూల్చేస్తుందని ప్రచారం చేస్తున్నారు. మోదీ...

మళ్లీ అదే నినాదం ఎత్తుకున్న మోడీ – ఏంటి సీక్రెట్ ..?

కొద్ది రోజులుగా కాంగ్రెస్ పై ఎదురుదాడి చేయడానికి ప్రాధాన్యత ఇచ్చిన ప్రధాని తాజాగా మరోసారి 400సీట్లు అంశాన్ని తెరపైకి తీసుకురావడం ఆసక్తికరంగా మారింది. ఈ ఎన్నికల్లో బీజేపీ గతం కన్నా ఎక్కువగా సీట్లు...

ఆ విషయంలో మంత్రులు ఫెయిల్..!?

కాంగ్రెస్ సర్కార్ టార్గెట్ గా ప్రతిపక్ష నేతలు దుమ్మెత్తిపోస్తున్నా ఒకరిద్దరూ మంత్రులు మినహా మిగతా వారెవరూ పెద్దగా స్పందించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. వీటన్నింటికి రేవంత్ ఒక్కడే కౌంటర్ ఇస్తున్నారు తప్పితే మంత్రివర్గం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close