ఏపీలో అత్యంత ప్రమాదకరమైన కరోనా మ్యూటెంట్ : సీసీఎంబీ

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ రకాల్లో అత్యంత ప్రమాదకర రకాన్ని సీసీఎంబీ శాస్త్రవేత్తలు కొనుగొన్నారు. N-440Kగా పిలిచే ఈ రకం వైరస్ ఆనవాళ్లు.. కర్నూలు కోవిడ్ పేషంట్లలో కనిపించాయి. ఇతర వైరస్‌ల కన్నా 10 రెట్లు N-440K వైరస్‌ ప్రభావం చూపుతుందని అంచనా అంచనా వేశారు. ఏపీలో మరణాలు అనూహ్యంగా పెరిగిపోతూండటం… కేసుల సంఖ్య పెరగడం… రికవరీలు తగ్గిపోవడంతో… ప్రమాదకరమైన మ్యూటేషన్లు ఏపీలో విస్తరించినట్లుగా అనుమానిస్తున్నారు. దీంతో ప్రభుత్వం కూడా సీరియస్‌గా స్పందించింది. పగటి పూట కూడా కర్ఫ్యూ పెట్టాలని నిర్ణయించింది.

ఐదో తేదీ నుంచి రెండు వారాల పాటు… కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఇప్పటికే నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంది. ఇప్పుడు పగటి పూట కూడా.. కర్ఫ్యూ అమలు చేస్తారు. ఉ.6 గంటల నుంచి మ.12 గంటల వరకు దుకాణాలకు దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇస్తారు. ఆ సమయంలోనూ 144 సెక్షన్‌ అమలు చేస్తారు. అత్యవసర సేవలకు మాత్రం కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంది. ఏపీ ఆస్పత్రుల్లో హాహాకారాలు వినిపిస్తున్నాయి. పది మంది.. ఇరవై మంది చనిపోతున్నారు. ఆక్సిజన్ కొరత వల్లేనని.. మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు.

అయితే ఆక్సిజన్ కొరతే లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరో వైపు ఆక్సిజన్ విదేశాల నుంచి అయినా సరే కొనుగోలు చేయాలని సీఎం జగన్ అధికారుల్ని ఆదేశించినట్లుగా ప్రెస్ నోట్లు విడుదలవుతున్నాయి. మొత్తంగా చూస్తే ఏపీలో కరోనా పరిస్థితి.. బయటకు చెప్పనంత తీవ్రంగా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ విషయంలో మంత్రులు ఫెయిల్..!?

కాంగ్రెస్ సర్కార్ టార్గెట్ గా ప్రతిపక్ష నేతలు దుమ్మెత్తిపోస్తున్నా ఒకరిద్దరూ మంత్రులు మినహా మిగతా వారెవరూ పెద్దగా స్పందించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. వీటన్నింటికి రేవంత్ ఒక్కడే కౌంటర్ ఇస్తున్నారు తప్పితే మంత్రివర్గం...

ఇలా అయితే కుదరదు మార్చాల్సిందే…త్వరలో సీఎం రేవంత్ కీలక నిర్ణయం

తెలంగాణ సీఎంవోను ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారా..? ఫైల్స్ క్లియరెన్స్ లో అధికారుల నిర్లక్ష్యంపై ఫిర్యాదులు అందటంతో సమర్ధవంతమైన అధికారులను నియమించాలని ఫిక్స్ అయ్యారా..? ఎన్నికల కోడ్ ముగియగానే సీఎంవోలో...

భార్యా బాధితులను కామెడీగానే చూస్తున్న సమాజం !

తన భార్య నుండి తనకు , తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకుంటూ ప్రెస్ మీట్ పెట్టారు. హైదరాబాద్ లో ఘటన...

అప్పుడే ప్రతిపక్ష పాత్ర పోషిస్తోన్న వైసీపీ..!!

ఏపీలో వైసీపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఎన్నికల ఫలితాన్ని ముందుగానే పసిగట్టారో మరేమిటో, అప్పుడే ప్రతిపక్ష పాత్రకు అలవాటుపడుతున్నట్లు కనిపిస్తోంది. అతిశయోక్తి అనిపించినా ఆ పార్టీ నేతలు చేస్తోన్న వరుస వ్యాఖ్యలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close