తిరుపతి రుయా ఆసుపత్రిలో కల్లోలం

కరోనా వైరస్ భారతదేశాన్ని వణికిస్తోంది. కాస్తో కూస్తో వైద్య రంగం పటిష్ఠంగా ఉన్న రాష్ట్రాలు కొంత వరకు పరిస్థితిని తట్టుకోగలుగుతూ ఉంటే అడ్మినిస్ట్రేషన్, మానిటరింగ్ సరిగ్గా లేని రాష్ట్రాలు విలయ తాండవం చూస్తున్నాయి. తాజాగా తిరుపతి రుయా ఆసుపత్రిలో జరిగిన సంఘటన ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఎంత కల్లోలంగా ఉంది అన్న దానికి అద్దం పడుతుంది. వివరాల్లోకి వెళితే.. 

తిరుపతి రుయా ఆసుపత్రిలో కోవిడ్ వార్డు అత్యవసర విభాగం లో ఆక్సిజన్ నిలిచిపోయింది. దీని వల్ల దాదాపు 10 మంది దాకా మృతి చెందగా మరో 13  మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆక్సిజన్ సరఫరా నిలిచి పోవడం పై రోగుల బంధువులు ఆందోళనకు దిగారు. సిబ్బంది నుండి ఎటువంటి సమాధానం రాక పోవడం, ఆక్సిజన్ సరఫరా పునరుద్ధరణ కాకపోవడంతో రోగుల బంధువులు ఐసియు వార్డు లోకి వెళ్లి సామాగ్రిని ధ్వంసం చేయడం ద్వారా తమ ఆవేదనను వ్యక్తం చేశారు. దీంతో నర్సులు భయపడి వార్డు నుండి పారిపోయారు. వైద్యులు నర్సులు అక్కడి నుండి వెళ్లి పోవడంతో రోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. చనిపోయిన వారిలో పట్టుమని 30 ఏళ్ళు కూడా నిండని, ఇతరత్ర ఎటువంటి ఆరోగ్య సమస్య లేని యువకులు కూడా ఉన్నారు. మరో రెండు రోజుల్లో డిశ్చార్జి కావాల్సిన పేషెంట్స్ కూడా కేవలం ఆక్సిజన్ సరఫరా నిలిచి పోవడం వల్ల మృత్యువు ఒడి లోకి చేరుకోవాల్సి వచ్చింది. ఆందోళన పెరిగి పెద్దది కావడంతో పోలీసులు జోక్యం చేసుకోవలసి వచ్చింది. పోలీసులు రుయా ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. 

పరిస్థితి ఇంత దయనీయంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం, పరిస్థితిని చక్కబెట్టడం కంటే,  పరిస్థితి రాష్ట్రంలో బాగాలేదు అని వ్యాఖ్యలు చేసే వారిపై రాజకీయ కక్ష సాధింపు మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంది అన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిరు, ప్ర‌భాస్‌, బ‌న్నీ.. ఒకే వేదిక‌పై!

మే 4... దాస‌రి జ‌న్మ‌దినం. ఈ సందర్భంగా ఓ భారీ ఈవెంట్ నిర్వ‌హించాల‌ని అనుకొంది ద‌ర్శ‌కుల సంఘం. అందుకోసం ఏర్పాట్లూ జ‌రిగాయి. అయితే ఎల‌క్ష‌న్ కోడ్ అడ్డురావ‌డంతో ఈ ఈవెంట్ వాయిదా ప‌డింది....

అదే జరిగితే సజ్జల పరిస్థితి ఏంటి..?

వైసీపీలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తుండటంతో జగన్ రెడ్డి ఆత్మగా చెప్పుకునే సజ్జల రామకృష్ణ పరిస్థితి ఏంటనేది బిగ్ డిబేట్ గా మారింది. వైసీపీ అధికారంలో ఉన్నాన్నాళ్ళు తనే సీఎం అనే తరహాలో...

థియేట‌ర్లు క్లోజ్.. హీరోల షేర్ ఎంత‌?

తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్ మూత‌ప‌డ‌డంతో టాలీవుడ్ ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. నిజానికి ఇలాంటి ప‌రిస్థితి ఎప్పుడో ఒక‌ప్పుడు వ‌స్తుంద‌న్న భ‌యం, ఆందోళ‌న అంద‌రిలోనూ ఉంది. అది ఒక్క‌సారిగా నిజ‌మ‌య్యేస‌రికి అవాక్క‌య్యారు. నిజానికి నెల రోజుల...

ఐ ప్యాక్ బృందానికి జగన్ రెడ్డి వీడ్కోలు..?

ఏపీ ఎన్నికల్లో అధికార వైసీపీకి సేవలందించిన ఐ ప్యాక్ కార్యాలయానికి జగన్ రెడ్డి ఎన్నికలు ముగిసిన రెండు రోజుల తర్వాత వెళ్తుండటం చర్చనీయాంశం అవుతోంది. వాస్తవానికి పోలింగ్ ముగిసిన తర్వాత ఐ ప్యాక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close