పట్టించుకోరా..? వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల్లో అలజడి..!

మీకే భయం వద్దు.. మేమున్నాం..! … అంటూ విజయసాయిరెడ్డి, గుర్రంపాటి దేవేందర్ రెడ్డి భరోసా ఇస్తున్నారు. కానీ ఆ భరోసా భరోసాలాగానే ఉండిపోయింది. వరుసగా సోషల్ మీడియా కార్యకర్తల్ని సీబీఐ అరెస్ట్ చేస్తూపోతోంది. కానీ అరెస్టయిన వారికి పార్టీ పరంగా న్యాయ సాయం కూడా అందడం లేదు. దీంతో లింగారెడ్డి అనే వ్యక్తి రెండో సారి జైలుకు పోవాల్సి వచ్చింది. బెయిల్ షరతుల ఉల్లంఘన కారణంగా జైలుకుపోవడంతో ఆయనకు మళ్లీ బెయిల్ వస్తుందో రావడం చెప్పడం కష్టం. అదే సమయంలో ఇతరుల అరెస్టులను ప్రారంభించారు. మరో ఇద్దర్ని అరెస్ట్ చేశారు. ఇరవై మందికిపైగా నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో మరింత అలజడి ప్రారంభమైంది. హైకోర్టు నోటీసులు ఇచ్చిన వారందర్నీ సీబీఐ ప్రశ్నించే అవకాశం ఉందని.. వారిలో అత్యధికుల్ని అరెస్ట్ చేస్తారని చెబుతున్నారు.

సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా ఉంటామని వైసీపీ నేతలు ప్రకటించారు. కానీ.. వారు అండగా ఉండే పరిస్థితి లేదు. వారు న్యాయవ్యవస్థపై చేసిన కామెంట్లను సమర్థించి.. వారికి న్యాయసాయం అందిస్తే.. వారి వెనుక తాము ఉన్నామన్న భావన పెరిగిపోతుందని.. అది మంచిది కాదని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అందుకే పైకి మాత్రం ధైర్యంగా ఉండండి.. అండగా ఉంటామని ప్రకటనలు చేస్తున్నారు కానీ నిజంగా మాత్రం.. వారికి సాయం చేసేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయడంలేదు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు ఈ అంశంపై అవగాహన వచ్చింది. అందుకే ఎక్కువ మంది తమ అకౌంట్లను డిలీట్ చేసుకుంటున్నారు.

యాక్టివ్ గా ఉన్న కొంత మంది.. వివాదాస్పద పోస్టుల పెట్టకుండా జాగ్రత్త పడుతున్నారు. అదే సమయంలో గతంలో న్యాయవ్యవస్థపైనా చేసిన వ్యాఖ్యల పోస్టులను తొలగిస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ సోషల్ మీడియాలో ఇతర పార్టీల గురించి ఆలోచించే పరిస్థితి లేకుండా పోయింది. పార్టీ అండగా ఉంటుందని ఇప్పటి వరకూ అనుకున్నాం కానీ.. ఇప్పుడుపావులాగా వాడుకుందన్న అభిప్రాయంలో ఎక్కువ మంది ఉన్నారు. సీబీఐ అరెస్టులు జోరందుకునే కొద్దీ… వైసీపీ సోషల్ మీడియా మరింతగా సంక్షోభంలో కూరుకుపోతుందని కొంత మంది అంచనా వేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

వైసీపీకి ‘చిరు’ బెంగ

ఏపీ ఎన్నికల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రచారం ఉదృతంగా సాగుతోంది. ఇప్పటికే...

ఈవారం బాక్సాఫీస్‌: రాంగ్‌ ‘టైమింగ్‌’ కాదుగా!?

ఏపీలో ఎన్నిక‌ల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఎక్క‌డ విన్నా, రాజ‌కీయాల‌కు సంబంధించిన అంశాలే. ఎవ‌రు గెలుస్తారు, ఎవ‌రు ఓడిపోతారు? అనే చ‌ర్చ తీవ్రంగా సాగుతోంది. సినిమా ముచ్చట్ల‌కు కొంత‌కాలం పుల్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close