ఏకగ్రీవం అవుతాయని తెలిసినా ఎన్నికలు వాయిదా..! కేసీఆర్ ప్లానేంటి..?

ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు తెలంగాణ సర్కార్ సిద్ధమయిందని.. ఆరుగురికి ఎమ్మెల్సీ పదవులు రాబోతున్నాయని ఆశావహులు పండుగ చేసుకుంటున్న సమయంలో కేసీఆర్ వారందరికీ పిడుగులాంటి వార్త పంపారు. ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించడం ఇప్పుడల్లా సాధ్యం కాదని నేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖరాశారు. దీనికి కారణం కరోనానే చూపించారు . రోజుకు ఆరు వందల కేసులు నమోదవుతున్నాయని ఇంకా.. పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ పూర్తి కాలేదని… ఈసీకీ తెలంగాణ సర్కార్ తెలిపింది. దీంతో అసెంబ్లీ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడల్లా జరిగే చాన్స్ లేదని చెప్పుకోవచ్చు. ఆరు స్థానాలు ఖాళీ అయి.. రెండు నెలలు అవుతోంది. అప్పట్లో కరోనాకారణంగా ఈసీనే వాయిదా వేసింది.

ఇప్పుడు.. ఎన్నికలు పెట్టే పరిస్థితి ఉన్నా.. తెలంగాణ సర్కార్ వద్దంటోంది. అయితే అసలు ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడు వద్దనుకోవడానికి కారణం కరోనా కాదని.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆశావహులందర్నీ సంతృప్తి పరచడం సాధ్యం కాదు కాబట్టి.. ఎవరూ అసంతృప్తికి గురి కాకుండా చేయడానికేనని అంటున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్‌లో ఆరు ఎమ్మెల్సీ సీట్లకు… ఇరవై మంది వరకూ పోటీ పడుతున్నారు. చాన్స్ రాని వాళ్లు… హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు నష్టం కలిగేలా వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందని.. కేసీఆర్ అంచనా వేసినట్లుగా చెబుతున్నారు. అందుకే ఆయన పదవుల భర్తీని వాయిదా వేసుకుంటున్నట్లుగా చెబుతున్నారు.

నిజానికి అవి ఎమ్మెల్యే కోటా ఎన్నికలు. అన్నీ ఏకగ్రీవంగా పూర్తవుతాయి. ఎన్నికలు జరిగే అవకాశం కూడా ఉండదు. అయినా అదేదో కరోనా వ్యాప్తి ఈవెంట్ అన్నట్లుగా కేసీఆర్ కలరింగ్ ఇచ్చి ఎన్నికల వాయిదాకు నిర్ణయించడం… కొంత మందిని ఆశ్చర్య పరుస్తోంది. హుజూరాబాద్ ఎన్నిక పెట్టాలనుకుంటే… వద్దని ఈసీకి సందేశం పంపడం కూడా ఇందులో ఇమిడి ఉందని అంటున్నారు. మొత్తానికి కేసీఆర్.. ఏ విషయాన్నైనా రాజకీయంగా వాడుకోవడంలో ముందుంటారని రాజకీయ వర్గాలు మరోసారి వ్యాఖ్యానించడం ప్రారంభించాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close