ప్చ్.. సింధు..! సెమీస్‌లో ఓటమి..!

ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించుకు వస్తుందని సింధుపై పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. సెమీస్‌లో చిరకాల ప్రత్యర్థి తైజూపై పైచేయి సాధించడంలో సింధూ విఫలమయింది. వరుస సెట్లలో పరాజయం పాలైంది. దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తోందన్న టెన్షన్‌కు గురయిందేమోకానీ.. సింధు మొదటి నుంచి ఒత్తిడిలో ఉన్నట్లుగానే ఆడింది. పెద్దగా పోటీ ఇవ్వలేదు. మొదటి సెట్‌లో కాస్త పోటీ ఇచ్చినట్లుగా కనిపించినా… తర్వాత మాత్రం పూర్తిగా నీరసించిపోయింది. మొదటి సెట్ కోల్పోవడంతో ఇక చేతులెత్తేసినట్లుగా ఆడింది.

సింధు తనదైన స్మాష్‌లను కొట్టలేకపోయింది. మరో వైపు ప్రత్యర్థి తైజూ మొదటి నుంచి ఆత్మవిశ్వాసంతో కనిపించారు. దానికి కారణం … పీవీ సింధుపై ఆమెకు ఉన్న ట్రాక్ రికార్డే కావొచ్చు. ముఖాముఖి ఆడిన మ్యాచ్‌లలో 80 శాతం విజయాలు తైజూ ఖాతాలో ఉన్నాయి. దీంతో తాను గెలవడం ఖాయమన్న అంచనాలో ఆమె ఆత్మ విశ్వాసాన్ని పెంచుకున్నట్లుగా కనిపించింది. మరో వైపు సింధుపై ఒత్తిడి పెరిగింది. కనీసం కాంస్య పతకం దక్కాలంటే… మరో మ్యాచ్‌లో గెలవాల్సి ఉంది. చైనా ప్లేయర్ జియాబావోతో కాంస్యం కోసం మ్యాచ్ జరగనుంది. ఆ మ్యాచ్‌లో గెలిస్తే… కాంస్య పతకం లభిస్తుంది. అలాఅయినా భారత్‌కు… సింధుకు ఘనతే.

గత ఒలింపిక్స్‌లో రజతం.. ఈసారి కాంస్యం సాధించిన ప్లేయర్‌గా గుర్తింపు దక్కుతుంది. అయితే భారత స్వర్ణం ఆశలను ఇతర ఆటగాళ్లు ముందుకు తీసుకెళ్తున్నారు. బాక్సన్ లవ్లీనాపై ఎక్కువ మంది ఆశలు పెట్టుకున్నారు. తొలి రోజే భారత్‌కు వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను పతకం అందించారు. ఆ తర్వాత మరో ఆటగాడు పతకం తేలేకపోయారు. పతకాల పట్టికలో భారత్ ఒక్క పతకంతోనే కొనసాగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

‘పారిజాత ప‌ర్వం’ రివ్యూ: సినిమా తీయ‌డం ఓ క‌ళ‌!

Parijatha Parvam movie review తెలుగు360 రేటింగ్: 1.5/5 'కిడ్నాప్ చేయ‌డం ఓ క‌ళ‌'... అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన చిత్రం 'పారిజాత ప‌ర్వం'. దాన్ని బ‌ట్టి ఇదో కిడ్నాప్ క‌థ‌ అని ముందే అర్థం చేసుకోవొచ్చు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close