సీబీఐ దూకుడుతో వైసీపీ సోషల్ మీడియాలో వణుకు..!

ప్రభుత్వ డిజిటల్ డైరక్టర్‌గా ప్రజాధనం జీతంగా తీసుకుంటున్న గుర్రంపాటి దేవేందర్ రెడ్డి .. అధికారికంగా నిర్వహించే విధులు మాత్రం వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జ్‌గా. ఆయన ట్వీట్లు… పోస్టులు ఎంత దారుణంగా ఉంటాయో… ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చంద్రబాబు దగ్గర్నుంచి రఘురామకృష్ణరాజు వరకూ ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా దూషించడంలో ఆయన పీహెచ్‌డీ చేశారు. ఆయన బాటలోనే ఆయన సోషల్ మీడియా టీం ఉంది. తమను ఎవరూ ఏమీ చేయలేరన్న ఉత్సాహంతో ..అదే దూకుడు న్యాయస్థానాలపైనా చూపించి ఇప్పుడు ఇరుక్కుపోయారు. ఆయనను సోమవారం దాదాపుగా ఎనిమిది గంటల పాటు సీబీఐ అధికారులు ప్రశ్నించారు.

న్యాయస్థానాలపై … న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులన్నీ.. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు పెట్టినవే. అన్నీ ఆర్గనైజ్డ్‌గా పెట్టారని.. సీబీఐ అనుమానిస్తోంది. ఓ పద్దతి ప్రకారం.. అందరికీ సూచనలు వెళ్లాయని.. అవి గుర్రంపాటి దేవేందర్ రెడ్డి నుంచే వెళ్లాయని భావిస్తున్నారు. ఎనిమిది గంటల విచారణలో గుర్రంపాటి నుంచి కీలకమైన సమాచారాన్ని సీబీఐ అధికారులు సేకరించారని అంటున్నారు. అసలు వైసీపీ సోషల్ మీడియా ఎలా నడుస్తుంది.. ఎంత ఖర్చు పెడుతున్నారు… పోస్టింగ్స్ పెట్టాలని ఎలా సందేశాలు పంపుతారు.. లాంటి వాటిని కూడా కూపీ లాగినట్లుగా తెలుస్తోంది. గుర్రంపాటి ఫోన్‌ను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకుని ఆయన సోషల్ మీడియా ఖాతాలను తెరిచి.. వివరాలను అడిగినట్లుగా కొంత మంది వైసీపీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు.

పరిస్థితి సీరియస్‌గా ఉందని తేలడంతో.. గుర్రంపాటి దేవేందర్ రెడ్డికి తోడుగా సీబీఐ విచారణకు ఇద్దరు ఎమ్మెల్యేను వైసీపీ హైకమాండ్ పంపింది. అయితే.. వారిని సీబీఐ అధికారులు కార్యాలయంలోకి అనుమతించలేదు. దాంతో వారు వెళ్లిపోయారు. మళ్లీ ఆయన విచారణ పూర్తయిన తర్వాత బయటకు వచ్చే సమయంలో రిసీవ్ చేసుకోవడానికి ఎమ్మెల్యే మల్లాది విష్ణు వచ్చారు. మీడియాతో మాట్లాడిన గుర్రంపాటి టీడీపీనే తమపై సీబీఐతో తప్పుడు కేసులు పెట్టించిందని ఆయన ఆరోపించి వెళ్లిపోయారు. ఈ కేసు అంత తేలికగా వదిలేది కాదని.. చాలా మంది చిక్కుల్లో పడబోతున్నారన్న ఓ అభిప్రాయం మాత్రం వైసీపీ సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కోమటిరెడ్డికి హైకమాండ్ వద్ద రిమార్క్స్

కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందని రేవంత్ రెడ్డి ఉబ్బేస్తున్నారు కానీ ఆయన పనితీరుపై హైకమాండ్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. చెప్పిన పని చేయకుండా నల్లగొండ పార్లమెంట్ పరిధిలో...

తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని ప్రచారం… షెడ్యూల్ ఇదే

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు ప్రధాని మోడీ. ప్రధాని పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంగళవారం రాత్రే హైదరాబాద్ చేరుకున్న మోడీ రాజ్ భవన్ లో బస చేశారు....

నిర్లక్ష్యమే ముంచింది…కాళేశ్వరంపై నిపుణుల మధ్యంతర నివేదిక

కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి నేషనల్ డ్యాం సేఫ్టీ మధ్యంతర నివేదికను అందజేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టాలో ప్రభుత్వానికి సూచించింది.వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని...

పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్ – విప్లవమే !

ఐదేళ్ల పాలనలో తాను చాలా విప్లవాలు తెచ్చానని జగన్ రెడ్డి చెబుతూ ఉంటారు. విప్లవం అంటే ఆ రేంజ్ అనుకుంటున్నారో కానీ ఆయన కానీ ఆయన రచయితలు కానీ ఆ పదాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close