కోర్టు కేసుల కోసం ప్రత్యేక శాఖ..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉన్నతాధికారులు కోర్టు కేసుల కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయనున్నారు. అయితే ఇది మంత్రివర్గ శాఖ కాదు. వ్యవస్థ లాంటిది. ఏపీ ప్రభుత్వం కోర్టుల్లో లక్షా 94వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. రోజుకు నాలుగు నుంచి ఐదు వందల పిటిషన్లు దాఖలవుతున్నాయి. వీటిని పర్యవేక్షించే వ్యవస్థ ఇప్పటి వరకూ లేకపోవడంతో కోర్టు ధిక్కార కేసులు పెరిగిపోతున్నాయి. ఎవరిపై పిటిషన్లు పడ్డాయో వారికి కౌంటర్లు వేయడానికి కూడా తీరిక ఉండటం లేదు. ఈ కారమంగా వివిధ శాఖలపై కోర్టుల్లో దాఖలయ్యే పిటిషన్లపై పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

ఆన్‌లైన్‌ లీగల్‌ కేస్‌ మానిటరింగ్‌ సిస్టం పేరుతో ఈ కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణియంచింది. ఈ మేరకు కార్యచరణ సైతం సిద్ధం చేసింది. పిటిషన్ల సత్వర పరిష్కారానికి ప్రతి విభాగంలో నోడల్‌ అధికారిని నియమిస్తారు. ఐఏఎస్ అధికారినే నియమించే అవకాశం ఉంది. అడ్వకేట్ జనరల్‌తో పాటు ప్రభుత్వ ప్లీడర్ల కార్యాలయాల్లో కూడా ఆటోమేషన్‌ వ్యవస్థ ఏర్పాటు చేసి.. అన్ని కేసుల వివరాలు రియల్‌టైమ్‌ డ్యాష్‌ బోర్డులో ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రభుత్వానికి ఇటీవల కోర్టు కేసుల చిక్కులు ఎక్కువయ్యాయి. అధికారులు ప్రతీ రోజు హైకోర్టుకు వెళ్లాల్సి వస్తోంది. ధిక్కరణ కేసులు పెరిగిపోతున్నాయి. అయితే వాటిలో చాలా వరకూ సరైన సమాచారం ఇస్తే వీగిపోయే కేసులేనని భావిస్తున్నారు. కానీ అలాంటి సమాచారం హైకోర్టుకు ఇచ్చే వ్యవస్థ లేకనే సమస్యలు వస్తున్నాయని నిర్ణయించారు. ఇప్పుడు ఆ బాధలన్నీ తప్పించుకోవడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. జీవోలను రహస్యంగా ఉంచాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం .. ఈ కేసుల కోసం ప్రత్యేక లైవ్ డాష్ బోర్డును ఏర్పాటు చేయాలనుకోవడం కొసమెరుపు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫైనల్ లెక్క : పోస్టల్ బ్యాలెట్లు 5 లక్షల 40 వేలు !

పోస్టల్ బ్యాలెట్ల ఫైనల్ లెక్క తేలింది. మొత్తం జిల్లాల వారీగా వచ్చిన లెక్కలను చూస్తే 5,39,189 ఓట్లుగా గుర్తించారు. పోస్టల్ బ్యాలెట్ల గడువు పూర్తియన తర్వాత చెప్పిన దాని కంటే దాదాపుగా...

శ‌ర్వానంద్.. అంత టైమ్ లేద‌మ్మా!!

శ‌ర్వానంద్ కొత్త సినిమా 'మ‌న‌మే' రిలీజ్ డేట్ ఖాయ‌మైంది. జూన్ 7న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్న‌ట్టు నిర్మాత‌లు అధికారికంగా ప్ర‌క‌టించారు. అంటే మ‌రో 15 రోజుల టైమ్ ఉంద‌న్న‌మాట‌. నిజానికి ఓ...

ఎక్స్‌క్లూజీవ్‌: ‘ఫిదా’ కాంబో మ‌ళ్లీ!

వ‌రుణ్‌తేజ్ కెరీర్‌లో మ‌ర్చిపోలేని సినిమా 'ఫిదా'. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ చిత్రం సూప‌ర్ హిట్ గా నిలిచిపోయింది. ఇప్పుడు వ‌రుణ్‌తేజ్‌, శేఖ‌ర్ క‌మ్ముల మ‌ళ్లీ క‌లిసి ప‌ని చేయ‌బోతున్నారు. ఏ...

అసెంబ్లీకి డుమ్మా…కేసీఆర్ దారిలోనే జగన్ రెడ్డి..?

ఏపీ ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోతే జగన్ పరిస్థితి ఏంటి..? అధికారం కోల్పోవడాన్ని అవమానంగా ఫీలయ్యే జగన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరు అవుతారా..? లేక కేసీఆర్ తరహాలోనే డుమ్మా కొడుతారా..? ఇప్పుడిదే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close