జగన్ రాష్ట్రంలో లేని సమయంలో బొత్స హడావుడి ఏంటి..!?

అమరావతిపై.. అమరావతి రైతులపై మంత్రి బొత్స సత్యనారాయణ సందర్భం లేకుండా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తెరపైకి వస్తున్నారు. గత ఆరు నెలలుగా ఎక్కడా కనిపించని బొత‌్స సత్యనారాయణ .. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత పర్యటనకు సిమ్లాకు వెళ్లిన సమయంలో అమరావతిలో హల్ చల్ చేస్తున్నారు. అమరావతి రైతుల్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. వారిపై అనుమచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. వారు మరోసారి ర్యాలీలు, ధర్నాలు చేసేలా ఆయన బొత్స ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమరావతి రైతులకు కుల ముద్ర వేశారు. వాళ్లతో చర్చించేదేంటి.. అని తీసి పడేశారు. ఈ వ్యాఖ్యలను కొన్ని మీడియా చానళ్లు హైలెట్ చేసి.. లేని పోని ప్రచారం కల్పించాయి.

నిజానికి బొత్స అన్న మాటల్లో కొత్తదనం ఏమీ లేదు. చాలా కాలంగా చెబుతున్నవే. అమరావతిపై వేయాల్సిన కులం ముద్ర ఎప్పుడో వేసేశారు. కొత్తగా ఏదో వేయాల్సిన పని లేదు. కానీ సందర్భం లేకుండా మరోసారి బొత్స అనడం.. ఆయనక మాటలకు కొన్ని టీవీ చానళ్లు లేనిపోని ప్రయారిటీ ఇవ్వడం ఏమిటన్నదే కొంత మంది వైసీపీ నేతలకు కూడా అంతుబట్టని విషయంగా మారింది. నిజంగా బొత్సను అలా మాట్లాడాలని ఎవరైనా చెప్పారా లేక సొంతంగా తనే చెప్పారా అన్నదానిపైనా స్పష్టత లేదు.

ముఖ్యమంత్రి జగన్ వ్యక్తిగత పర్యటనకు సిమ్లా వెళ్లారు. ఆయన మళ్లీ మంగళవారం వచ్చే అవకాశం ఉంది. ఈ లోపు రాష్ట్రంలో ఎలాంటి కీలకమైన ఘటనలు జరగకుండా చూసుకోవాల్సి ఉంది. అలాంటప్పుడు మొత్తం సైలెంట్‌గా ఉండాలి. కానీ బొత్స మాత్రం అమరావతి రైతుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. దీని వెనుక ఏదో గూడుపుఠాణి ఉందన్న అనుమానం కలిగేలా చేశారు. బొత్స వ్యవహారంపై వైసీపీలోనే రకరకాల చర్చలు ఉన్నాయి. ఆయన తరచూ ఢిల్లీకి వెళ్లివస్తున్నారన్న గుసగుసలూ వినిపిస్తూ ఉంటాయి. అందుకే బొత్స అసందర్భ ఆవేశం వెనుక ఏదో ఉందన్న అనుమానాలు వైసీపీలోనే ప్రారంభమయ్యాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్నికల్లో ప్రజలకు పరీక్ష పెడుతోన్న జగన్ రెడ్డి..!?

ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలను జగన్ రెడ్డి పరిక్షీస్తున్నట్టు ఉంది. సొంత చెల్లి మీడియా ముంగిటకు వచ్చి జగన్ నిజస్వరూపం బయటపెడుతున్నా నిజాన్ని నిందగా చిత్రీకరించుకుంటూ జనం మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుండటం...

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close