“మా” విందులు – బం‌డ్ల గణేష్ చిందులు..!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల కోసం టాలీవుడ్‌లో హడావుడి ప్రారంభమయింది. గెట్ టు గెదర్ లాంటిపార్టీలు రెండు వర్గాలు ఇవ్వడం ప్రారంభించాయి. మొదటి నుంచి మా అధ్యక్ష పదవి కోసం గట్టిగా పోటీ పడుతున్న ప్రకాష్ రాజ్ సభ్యులందరికీ పార్టీ ఏర్పాటు చేసింది. భోజనాలు చేస్తూ మాట్లాడుకుందాం రమ్మని సభ్యులకుభారీ ఎత్తున ఆహ్వానాలు పంపారు. నిజానికి రెండు రోజుల ముందుగా ప్రకాష్ రాజ్ మా ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ ఏర్పాటు చేసిన ఓ పార్టీపై విమర్శలు గుప్పించారు. తాగుతారు.. తింటారు అందులో తప్పేముందని వెటకారంగా మాట్లాడారు.

ఇప్పుడు ఆయనే అలాంటి పార్టీని ఏర్పాటు చేశారు. ఇదంతా రాజకీయం అనుకునేంతలో వీరికి పోటిగా బండ్ల గణేష్ కూడా రంగంలోకి దిగారు. అయితే ఇలా పార్టీలు ఇవ్వడం ఖర్చుతో కూడుకున్న పని అనుకున్నారేమో కానీ అసలు పార్టీ కల్చర్‌పైనే విమర్శలు ప్రారంభిచారు. కరోనా టైంలో అందర్నీ ఒక దగ్గరకు చేర్చడం మంచిది కాదని ఓట్లు అడగాలనుకుంటే ఫోన్లలో అడగాలని పిలుపునిచ్చారు. బండ్ల గణేష్ మొదట ప్రకాష్ రాజ్ ప్యానల్‌లో ఉన్నారు. తర్వాత ఆయనను తొలగించి జీవితా రాజశేఖర్ కు చోటిచ్చారు.

దీనిపై బండ్ల గణేష్ అసంతృప్తికి గురై తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ప్రకటించారు. ఎవరేమన్నా పోటీ చేస్తానని సభ్యులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తానని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో విందులపై తన వ్యతిరేకతను నేరుగా వ్యక్తం చేశారు. వచ్చే నెల పదో తేదీన మా ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇంకా మంచు విష్ణు ప్యానెల్ ను ప్రకటించలేదు. అయితే ఆ వర్గం తరపున ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ ఎక్కువ లీడ్ తీసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇదేం టైటిల్ రౌడీ బోయ్‌…?

సంతోషం స‌గం బ‌లం అంటారు. సినిమాకు టైటిల్ కూడా అంతే. టైటిల్ ఎంత క్యాచీగా, ఎంత కొత్త‌గా ఉంటే అంత ప్ల‌స్సు. అందుకే టైటిల్ విష‌యంలో ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డిపోతూ...

ముద్రగడ పద్మనాభ రెడ్డిగా ఫిక్స్ అయిపో..!?

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించకపోతే పేరు మార్చుకుంటానని ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. పద్మనాభం అని కాకుండా పద్మనాభ రెడ్డి అని మార్చుకుంటానని సవాల్ చేశారు. ముద్రగడ ధీమా ఏంటో...

నన్ను పట్టించుకోరా… ఓ తండ్రి అనూహ్య నిర్ణయం

కని పెంచిన కొడుకులు పట్టించుకోలేదని నిరాశ చెందిన ఓ తండ్రి అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. రెక్కల కష్టంతో పెంచిన కొడుకులు తనను పట్టించుకోవడం లేదనే ఆగ్రహంతో యావదాస్తిని కొండగట్టు ఆంజనేయ స్వామికి సమర్పించేందుకు...

డైరెక్ట‌ర్స్ డే… రాజ‌మౌళి ‘డాన్స్’ షో!

ద‌ర్శ‌క దిగ్గ‌జం దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌యంతిని పుర‌స్క‌రించుకొని, తెలుగు ద‌ర్శ‌కులంతా క‌లిసి 'డైరెక్ట‌ర్స్ డే'ని సెల‌బ్రేట్ చేసుకోబోతున్నారు. మే 4న ఈ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో జ‌రగ‌బోతోంది. అందుకోసం ద‌ర్శ‌కులంతా క‌లిసి క‌స‌ర‌త్తులు చేస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close